తెలుగు బుల్లితెరకు పరిచయం అవసరంలేని వ్యక్తి ప్రదీప్ మాచిరాజు. ప్రస్తుతం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమాలోని పాట ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకన్నా’ ని నాలుగు కోట్ల మందికి పైగా వీక్షించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ప్రిన్స్ మహేష్ బాబు ఈ సాంగ్ ను రిలీజ్ చేయడంతో విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాను టాలీవుడ్ కు చెందిన రెండు టాప్ నిర్మాణ సంస్థలు విడుదల చేసేందుకు ముందుకొచ్చాయి. అవి ఏవంటే అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్, ప్రభాస్ కు చెందిన యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తంగా థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకుంటున్నాయి.
ఈ సినిమాలో "అమృతా అయ్యర్" కథానాయికగా నటించారు. ఈ సినిమా ప్రెకషకుల ముందరకు మార్చి 25 న రాబోతుంది. ఈ సినిమాకు గాను అనూప్ రూబెన్స్ సంగీతాన్ని పొందుపరిచారు. మొదట్లో ఈ సినిమాను మొదలు అయ్యేటప్పుడు రానా దగ్గుబాటి నుంచి మంచి సపోర్ట్ లభించింది. రాణానే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. అలాగే ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు. అసలికి సినిమాకి ముఖ్యమైన దర్శకత్వాన్ని మున్నా చెప్పట్టారు. బుల్లి తెర సూపర్ స్టార్ అయిన ప్రదీప్ కి ఉన్న క్రేజ్తో సినిమాకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం వారికి రాలేదు.
ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ షోకు గెస్ట్ గా వెళ్లిన ప్రదీప్, సుడిగాలి సుధీర్ టీంతో కలిసి వారితో స్కిట్ చేసారు. అందులో కూడా తన సినిమాను కావలిసినంత బాగా ప్రమోట్ చేసుకున్నాడు. ఈ సినిమాలోని మొదటగా రిలీజ్ అయిన 'నీలి నీలి ఆకాశం' ఎంతటి సెన్సేషన్ క్రియేట్ ప్రతేకంగా చెప్పనక్కర్లేదు. దీని తర్వాత "ఇదేరా స్నేహం.. కనివిని ఎరుగని స్నేహం, ఇది కాలం చూడని స్నేహం.. దేహం అడగని స్నేహం..' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ యూత్ ను బాగానే ఆకట్టుకుంటుంది.