ఐశ్వర్యా రాజేశ్.. గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పేరులోనే కాదు, అందంలోనూ తాను ఐశ్వర్య రాలేనని ఆమెను చుసిన ఎవరికైనా అనిపించక మానదు! అలాగే.. ఆమె వంటలు చేయడంలోనూ మంచి నేర్పరి అట! మనకు తెలిసినదే.. రోజూ షూటింగ్లు, మూవీ ప్రమోషన్లతో బిజీబిజీగా ఉండే నటీనటులు, కాస్త సమయం చిక్కినప్పుడల్లా అప్పుడప్పుడు వారికిష్టమైన విషయాల పట్ల ఫోకస్ చేస్తూ వుంటారు.
సరిగ్గా అలాంటి సంఘటనే జరిగింది.. ఇక్కడ. ఇటీవల తన షూటింగ్ విరామంలో మన తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్ నోరూరించే వేడివేడి ఎగ్దోశ వేసి, అందరి విస్మయానికి కారణం అయ్యిందట! ఇక ఆ ఎగ్ దోశ తిన్న సగటు యూనిట్.. దోశ అమోఘమని, అలాంటి దోశ తామెప్పుడూ తినలేదని... కనీసం దోశ దర్బారులో కూడా అలాంటి దోశలు దొరకవని చెప్పడం.. ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక పాక నిపుణులు ఆ దోశ వేయడంలో ఉపకరించిన రెసిపీని చెప్పమని ఐశ్వర్యను తెగ బతిమలారట. ఇక తను దోశ వేసిన వీడియోను ఆమె తన ఇన్స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ సదరు రెసిపీ వివరాలు తమకు కూడా కావాలని అడుగుండటం ఇక్కడ విశేషం.
ప్రస్తుతం ఐశ్వర్యా రాజేశ్ కోలీవుడ్లో బిజీ అయిపోయిన మన అచ్చ తెలుగు వనిత. అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. పా.రంజిత్ నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో ఆమె నటిస్తోంది. సతీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు తమిళంలో భూమిక, కా.పే రణసింగం, ఇదు భేతాళం సొల్లుం కథై చిత్రాల్లో మన అమ్మడు నటిస్తోంది. ఇక తెలుగులో నాని ‘టక్ జగదీష్’ చిత్రంలో నటించిన విషయం అందరికి విదితమే. ఇక ఇటీవలే విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో సువర్ణ పాత్రలో అదరగొట్టిన సంగతి అందరికి తెలిసినదే.