అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. 'ఫిదా' వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. కాగా ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయాలి. కానీ షూటింగ్ ఆలస్యంగా జరగడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా పోటీ ఉండటంవల్ల సమ్మర్ ని టార్గెట్ చేసి ఏప్రిల్ మొదటి వారంలో లేకపోతే రెండో వారంలో రిలీజ్ చేసే ఆలోచనలో శేఖర్ కమ్ముల ఉన్నట్లు సమాచారం.

 

ఇటీవల సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెంచాయి. చాలా బాగా ఉండటంతో ‘లవ్ స్టోరీ’ సినిమా తో మరోసారి ‘ఏ మాయ చేశావే’ సినిమా తరహాలో విజయం సాధించడం గ్యారెంటీ అని అక్కినేని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నాగచైతన్య చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తూ సాయి పల్లవి కాస్త 'ఫిదా' లుక్‌లో కనిపిస్తున్న ఈ చిత్రంపై అక్కినేని ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్నారు. చైతూకు 'ఫిదా' వంటి సక్సెస్‌ను ఈ చిత్రంతో దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇస్తాడేమో అంటూ నమ్మకంగా ఉన్నారు.

 

ఆసక్తిగా అక్కినేని ఫ్యాన్స్‌ ఏప్రిల్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా మళ్లీ ప్రకటన వచ్చింది. దీంతో అక్కినేని అభిమానులు నాయనా కమ్ములా నీకోక దండం అంటున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తానని చెప్పి ట్రైలర్ అద్భుతంగా చూపించిన ఊరించి ఈ విధంగా మాతో ఆడుకోకూడదు అంటూ సోషల్ మీడియాలో శేఖర్ కమ్ములపై అక్కినేని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే సినిమాల్లో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ కొన్ని మిగిలిపోవడం వల్ల మళ్లీ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: