టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో నటించిన భరత్ అనే నేను, గత ఏడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన మహర్షి, అలానే మొన్న సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్సకత్వంలో నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా మూడు విజయాలు అందుకుని, హ్యాట్రిక్ సక్సెస్ లతో మంచి జోష్ మీదున్నారు. అయితే గత కొద్దిరోజులుగా మాత్రం తన తదుపరి సినిమా విషయమై మాత్రం మహేష్ కొంత గట్టిగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మహేష్ తన నెక్స్ట్ సినిమాని వంశీ పైడిపల్లి తో చేయాల్సి ఉండగా, ఆ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధం కాకపోవడంతో అది కొంత వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. 

 

ఈ మధ్యలో పరశురామ్ పెట్ల మంచి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీని మహేష్ కి వినిపించారని, అది మహేష్ ని ఎంతో ఎగ్జైట్ చేయడంతో వెంటనే ఆ సినిమాలో నటించడానికి ఆయన పచ్చ జెండా ఊపారని అంటున్నారు. కాగా అదే సమయంలో ప్రస్తుతం మెగాస్టార్ 152వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న కొరటాల శివ, ఆ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మహేష్ ని  సంప్రదించడం జరిగిందని, సినిమాలో అరగంటసేపు ఉండే ఆ పాత్ర, సినిమాలో ఎంతో కీలకం అని వివరించినట్లు చెప్తున్నారు. అయితే ఈ పాత్ర కోసం మొదటగా రామ్ చరణ్ ని తీసుకోవాలని భావించినప్పటికీ, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్, ఆ సినిమా పూర్తి అయ్యేవరకు వేరొక సినిమా చేయకూడదని భావించడంతో, అటువంటి పవర్ఫుల్ పాత్రకు మహేష్ అయితే సరిగ్గా సరిపోతారని భావించిన కొరటాల, మొన్న సినిమా కథను మహేష్ కు వినిపించారని, అలానే మహేష్ కూడా కథ నచ్చి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని వార్తలు వచ్చాయి. 

 

అయితే రెండు రోజుల క్రితం నుండి వస్తున్న వార్తలను బట్టి చూస్తుంటే, ఆ పాత్రలో మహేష్ కు బదులు అల్లు అర్జున్ ని తీసుకున్నారని అంటున్నారు. మొదటి నుండి మెగాస్టార్ మూవీ లో ఒక్క ఛాన్స్ వస్తే చాలు నటించాలని భావిస్తున్న బన్నీకి ఈ అవకాశం రావడంతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కాగా ఈ విధంగా ఆ సినిమా విషయమై పలు వార్తలు ప్రచారం అవుతుండడంతో, వీటిలో ఏది నిజమో ప్రేక్షకులకు మాత్రం అర్ధం కావడం లేదు. ఈ విషయమై కొరటాల అండ్ టీమ్ త్వరలో అధికారిక ప్రకటన రిలీజ్ చేస్తే బెటర్ అని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: