టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ ఒకరు. నందమూరి హీరోతో ఈమె టాలీవుడ్ లో తన ప్రయాణం మొదలుపెట్టింది. కళ్యాణ్ రామ్ తో చేసిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత చందమామ అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక అక్కడి నుంచి ఈమె వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తుంది. స్టార్ హీరోలు కూడా ఆమెతో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపించారు అనేది వాస్తవం. ఇక కాజల్ క్రమంగా పారితోషికం కూడా పెంచింది. 

 

ఆమెకు నటన కూడా ప్లస్ అవ్వడంతో ఆమెను చాలా మంది దర్శకులు తమ సినిమాల్లోకి తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు అనేది వాస్తవం. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ హీరోయిన్ గా ఉంది. ఆమె సినిమాల్లోకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు అవుతుంది. దగ్గుబాటి, నందమూరి, మెగా, అక్కినేని, ఘట్టమనేని ఇలా అందరు హీరోల సినిమాల్లో ఆమె చేసింది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా చేయని విధంగా ఆమె సినిమాలు చేసింది. గతంలో శ్రీదేవి సౌందర్య ఇలా చేసే వారు అని అనే వారు.

 

అనుష్క కూడా సీనియర్ హీరోయిన్ అయినా సరే ఇలా అన్ని కుటుంబాలతో ఆమె కలిసి పని చేయలేదు.  దానికి కారణం ఏంటో కూడా తెలియదు. అయితే ఇప్పుడు కాజల్ టాలీవుడ్ ని వదిలేసింది అంటున్నారు టాలీవుడ్ జనం. కాజల్ కు ఇప్పుడు బాలీవుడ్ మీద దృష్టి పడింది అని, అక్కడ ఒకటో రెండో సినిమాలు చేసి తమిళంలో ఒకటో రెండో సినిమాలు చేసి ఇక సినిమాల నుంచి తప్పుకునే ఆలోచనలో కాజల్ ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: