సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత ఆయన నెక్స్ట్ సినిమా ఏంటని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే సరిలేరు షూటింగ్ లో ఉన్నప్పటి నుంచే వంశీ పైడి పల్లి తో సినిమా ఉంటుందని బాగా ప్రచారం జరిగింది. దాదాపు సూపర్ స్టార్ వంశీ పైడి పల్లి తోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడని అందరూ ఫిక్సైపోయారు. అయితే సూపర్ స్టార్ వంశీ పైడి పల్లికి పెద్ద షాక్ ఇచ్చాడు. వంశీ చెప్పిన కథ నచ్చలేదని నిర్మొహమాటంగా చెప్పి వెనక్కి పంపేశాడు. కొన్ని రోజులకి మళ్ళీ వేరే లైన్ తో వంశీ మహేష్ బాబు ని ఒప్పించాలని చేనిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

 

అయితే ఈ గ్యాప్ లో మహేష్ బాబు పరశురామ్ తో సినిమా చేస్తున్నారని ఇదే సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమా అని మరోసారి ప్రచారం ఊపందుకుంది. అయితే వాస్తవంగా పరశురామ్ నాగ చైతన్యతో సినిమాను చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే మహేష్ బాబు కి పరశురామ్ కథ చెప్పాడని ఆ కథ మహేష్ బాబు కి బాగా నచ్చి వెంటనే మనం సినిమా చేస్తున్నామని మాట ఇచ్చినట్టు హాట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలో బాగా ప్రచారమవుతోంది.

 

అంతేకాదు భారత ఆర్ధిక వ్యవస్థ పై దెబ్బ పడేలా బ్యాంకుల నుండి భారీ మొత్తాలను రుణాలు గా పొంది వాటిని ఎగవేసి విదేశాలకు వెళ్లిన విజయ్ మాల్య మరియు నీరవ్ మోడీల పాత్రల ఆధారంగా కథ తయారు చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ అసలు క్లారిటీ మిస్సయిందేమిటంటే ఈ కథలో మహేష్ బాబు పాత్ర ఏమిటి అన్నది. ఇందులో క్లారిటీ లేదంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ కాంబోలో సినిమా అన్నది గాలి వార్తే అని అనుకోవాలి. లేదా కథ ఇది కాదన్న విషయం అన్న నిజమై ఉండాలి. ఏదేమైనా మహేష్ బాబు ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నది ఆయనే క్లారిటే గాని నమ్మలేము. ఇక ప్రస్తుతం అఫీషియల్ గా మహేష్ బాబు నటిస్తున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మాత్రమే. మే నుండి ఈ సినిమాలో మహేష్ బాబు జాయిన్ కాబోతున్నారు. పూజా హెగ్డే మహేష్ బాబు కి జంటగా నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: