ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీ రెడ్డి, రాకేష్ మాష్టర్, కరాటే కళ్యాణిల వ్యవహారం ఒక హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. దీనికి కారణం వీరు ముగ్గురు ఒకరిపై ఒకరు దూషించుకోవడం. దానితో సరిపెట్టుకోకుండా సవాళ్లు విసురుకోవడం, కేసులు పెట్టుకోవడం అలాంటివి అందరికీ తెలిసిన సంగతే. వీరందరికి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా వీరు పెట్టుకున్న కేసుల్లో కాస్త కదలికలు వచ్చినట్టు అనిపిస్తోంది.

 

IHG

 

అసలు జరిగిన విషయానికి వస్తే రాకేష్ మాస్టర్ ఒక యూట్యూబ్ చానెల్‌ తో మాట్లాడుతూ శ్రీరెడ్డి పై ఆయన స్టైల్ లో విరుచుకుపడ్డాడు. దీనితో గతాన్ని మళ్లీ తవ్వి తీసినట్లైయింది. అప్పటి వరకు కామ్ గా ఉన్న శ్రీ రెడ్డి మళ్లీ తన విశ్వరూపాన్ని బయటపెట్టింది. పదునైన తన శైలి పదజాలంతో రాకేష్ మాస్టర్, కరాటే కళ్యాణిలను అనరాని మాటలు అనింది. దీనితో మళ్లీ గొడవ మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఎందుకో తెలియదు శ్రీరెడ్డి కరాటే కళ్యాణిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ, కించపరిచేలా ఫేస్‌ బుక్ లైవ్‌ లో ఒక అట అడ్డుకుందని చెప్పవచ్చు. ఆ వీడియో చూసిన కరాటే కళ్యాణి వీడియోతో పాటు దానికి సంబంధించిన ఆధారాలను పొందుపరుస్తూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు అందించింది.

 

IHG

 

ఇది ఇలా ఉండగా పోలీసులకు ఫిర్యాదు చేసినా నేను అలంటి ఏమి పట్టించుకోను, నన్ను అరెస్ట్‌ చేసినా సరే అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో క్లియర్ గా ఉన్నాయి. ఇక్కడే కాకుండా చెన్నైలోనూ శ్రీరెడ్డి కరాటే కళ్యాణి, రాకేష్ మాస్టర్‌లపై ఫిర్యాదు అందించింది. ఇలా వీరు ఇచ్చిన వాటిల్లో ప్రస్తుతం కరాటే కళ్యాణి ఫిర్యాదు కాస్త ముందుకు సాగిందంట. దీనితో ప్రస్తుతం కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదు గాను నమోదైన కేసులో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చర్యలు మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ కేసులో నిందితురాలిగా పేరుకొంటూ శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. వీటిని చేతబట్టుకొని చెన్నై వెళ్లిన ప్రత్యేక బృందం శుక్రవారం ఆమెకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు చూడాలి ఇంకా ముందుముందు ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: