చైనా దేశంలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన కరోనా...  ప్రస్తుతం ప్రపంచ దేశాలను కూడా వనీకిస్తున్న  విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ వైరస్ భారత్ కి కూడా చేరుతుంది. రోజురోజుకు భారతదేశంలో కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్  ప్రజలను ప్రాణ భయంతో వణికికిస్తోంది . అయితే ఈ వైరస్ ఎక్కడ తమకు  సోకుతుందోనని  ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రతి విషయం పై స్పందిస్తూ భిన్నమైన రీతిలో ఎవరు ఊహించలేని విధంగా కామెంట్ చేస్తూ ఉంటారు సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ. తనదైన స్టైల్లో స్పందిస్తూ... భిన్నమైన పోస్టులు పెడితూ  అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. 

 

 

 తాజాగా కరోనా  వైరస్ పై  కూడా స్పందిస్తున్న రామ్ గోపాల్ వర్మ  భిన్నమైన పోస్ట్ లు పెడుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మనల్ని   చంపితే కరోనా కూడా చేస్తుందని వర్మ ఒక ఫిలాసఫీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే కరోనా పై వర్మ పెట్టిన పోస్టులు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక తాజాగా మరోసారి కరోనా పై  వర్మ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి అందరిని మరోసారి షాక్ కి గురి చేశాడు. కరోనా  వైరస్ ను  అరికట్టాల్సిన సూపర్ మాన్,  బ్యాట్ మాన్,  స్పైడర్ మాన్ లు  ఎక్కడికి పోయారు అంటూ వర్మ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. 

 

 

 

 దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ ఐపోతుంది. ప్రపంచానికి పెనుముప్పు వచ్చినప్పుడు సూపర్ మాన్, బ్యాట్ మాన్, స్పైడర్ మాన్ ఇలా ఎవరో ఒక మ్యాన్ వచ్చి  కాపాడుతాడు అన్న విషయాన్ని వర్మ గుర్తుచేస్తూ పోస్ట్ పెట్టాడు. కరోనా  వైరస్ అనే విలన్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంటే... సూపర్ మాన్,  బ్యాట్ మాన్,  స్పైడర్ మాన్ లు  ఎక్కడికి వెళ్లారు అంటూ ప్రశ్నించారు రాంగోపాల్ వర్మ. ఇక వర్మ పెట్టిన పోస్ట్ క్షణాల్లో సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది. అంతేకాదు కరోనా  వైరస్ కి జ్ఞానం ఉంటే బాగుండు అంటూ వర్మ చేసిన పోస్ట్  కూడా గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: