రెండేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. రావడమే జెట్ స్పీడ్ లో సినిమాలు ఒకే చేస్తూ ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టి విరామం లేకుండా షూటింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అమితాబ్ నటించిన సూపర్ హిట్ మూవీ పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ టాకీ పార్ట్ కంప్లీటయిందని సమాచారం. 

 

ఇక ఈ వకీల్ సాబ్ లుక్ తో పాటు సాంగ్ ప్రోమో కూడా రిలీజై బాగా ఆకట్టుకుంటున్నాయి. పక్కా రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ తో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడని అందరూ ఫిక్సైయ్యారు. మే 15 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జాగర్ల మూడి రాధా కృష్ణ 
( క్రిష్ ) దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. సముద్రంలో ఓడలో తరలిపోతున్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే ఫైట్ ని పవన్ కళ్యాణ్ పై క్రిష్ చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలువనుందట. అయితే సినిమాకే హైలైట్ గా నిలువనున్న ఈ ఫైట్ ని ‘షాడో ఫైటర్’ అనే పాపులర్ వీడియో గేమ్ ద్వారా ఇన్స్‌పైర్ అయి చిత్రీకరిస్తున్నారని న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది.

 

ఈ యాక్షన్ సన్నివేశంలో కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేప్పుడు పవన్ కళ్యాణ్ చేసే సాహసాలు ఎంతో హైలెట్ అవుతాయని క్రిష్ అంటున్నారట. ఈ దొంగతనం సన్నివేశానికి పవన్ కళ్యాణ్ స్టైల్ లో ఉండే యాక్షన్ సీన్స్ బాగా హైలెట్ అయి సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని నిర్మిస్తుండగా విజయదశమి లేదా దీపావళి కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లాగే కొంతమంది నెటిజన్స్ క్రిష్ ని ఏకిపారేస్తున్నారట. మేము ఆయనని సీ.ఎం గా చూడాలనుకుంటే మీరు దొంగ గా చూపిస్తారా ..మీకు మైండ్ సరిగ్గానే పని చేస్తుందా అని కామెంట్స్ చేస్తున్నారట. మరి క్రిష్ పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించబోతున్నారో సినిమా రిలీజైతే గాని అర్థం కాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: