గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్న కామెడి షో జబర్దస్త్‌, ఎక్స్ట్రా జబర్దస్త్‌. ఈ షో మొదలైప్పటి నుంచి ఎక్కువగా అడల్ట్ కామెడీతో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. మగవాళ్ళకి చీరలు కట్టి నానా చండాలమైనా కామెడీ ని పండిస్తుంటే అది చూసి టీవిలకి అతుక్కుపోయిన ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఈ షోకి విపరీతమైన టి.ఆర్.పి వస్తుండటంతో మల్లెమాల వాళ్ళు ఇంతకాలం రన్ చేస్తున్నారు. అయితే మధ్యలో కొన్నాళ్ళు ఆ అడల్ట్ కామెడీ మరీ శృతి మించడం తో ఏకంగా రామోజీ రావు మల్లెమాల యాజమాన్యాన్నే టార్గెట్ చేసి కొంతమంది నానా మాటలు అన్నారు. 

 

దాంతో అప్పటి నుంచి కాస్త స్కిట్స్ లో వర్ల్గారిటీని తగ్గించారు. మరీ నాటు బూతులు మాట్లాడకుండా స్కిట్స్ ని మరీ చండాలంగా డిజైన్ చేయకుండా మల్లెమాల జాగ్రత్తలు తీసుకుంది. ఇక ఈ షోలో ఎక్కువగా అతి చేస్తూ ఆకట్టుకుంటుంది హైపర్ ఆది టీం. కామెడి టైంగ్ అదిరిపోతున్నప్పటికి బాగా డబుల్ మీనంగ్ డైలాగ్స్ ఆది స్క్టిస్ ని బాగా పాపులర్ చేశాయి. అంతేకాదు అంతకంతగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఆది. ఇక రీసెంట్ గా ఆది టీం లో ఉన్న దొరబాబు, పరదేశీ సెక్స్ రాకెట్ లో అడ్డంగా దొరికిపోవ‌డంతో పెద్ద సంచలనం అయింది.

 

మల్లెమాల వంటి పెద్ద నిర్మాణ సంస్థ లో నిర్మితమవుతున్న జబర్దస్త్‌ షో లోని ఆది టీం లో ఉన్న దొరబాబు, పరదేశీ లను ఏ రకంగా తీసుకున్నారని అసలు ఈ షోలో ఉన్న పార్టిసిపెంట్స్ ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారా ..ఇది యాజమాన్యానికి తెలీకుండా జరిగినప్పటికి ఇంతకాలంగా తమ కంపెనీలో చెస్తున్న వాళ్ళు ఎలాంటి తెలుసుకోవడం బాధ్యత కదా అని ఇండస్ట్రీలో పెద్దలు ప్రశ్నించారట.

 

ఇక ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే దొరబాబు, పరదేశీ ఎలాంటి వాళ్ళో తెలిసే ఆది ఎంకరేజ్ చేశాడని తన టీం లో తీసుకున్నాడని ఆది కూడా తక్కువేం కాదని ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నాయి. స్కిట్ లో వేసిన వేశాలే ఆది టీం బయట కూడా వేస్తారని అంటున్నారట. అయితే దొరబాబు, పరదేశీ లని టీం లోకి అసలెందుకు తీసుకున్నావని ఆదిని మల్లెమాల యాజమాన్యం గట్టిగా నిలదీసిందట. అంతేకాదు ఆదిని తీసేయాలన్న ఆలోచనలో ఉన్నారని తాజా సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: