ముందుగా నటిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఛార్మి కౌర్, ఆ తరువాత పూరి జగన్నాథ్ తీస్తున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. తనకు హీరోయిన్ గా కంటే, ప్రస్తుతం నిర్మాతగా జీవిస్తున్న లైఫ్ ఎంతో బాగుందని, ఎటువంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా గడిపేయొచ్చని అంటున్నారు ఛార్మి. ముందుగా నీతోడు కావాలి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి, ఆ తరువాత నుండి మెల్లగా మన తెలుగు సినిమా పరిశ్రమలో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక ఆ తరువాత కొందరు స్టార్ హీరోల తో పాటు పలువురు యువ హీరోల సరసన కూడా సినిమాలు చేసిన ఛార్మి, నటిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక మంచి పేరుని దక్కించుకున్నారు అనే చెప్పాలి. ఇక కొన్నేళ్ల క్రితం వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమా మంత్ర తో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన ఛార్మి, ఆ తరువాత కూడా అటువంటి మరికొన్ని సినిమాలు చేసారు. 

 

అయితే ఆపై మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, వాటి ద్వారా ఆమెకు ఆశించిన రేంజ్ లో సక్సెస్ అయితే లభించలేదు. అనంతరం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన జ్యోతి లక్ష్మి సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఛార్మి, ఆ సినిమాలో టైటిల్ రోల్ లో నటించారు. అప్పట్లో ఆ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకోవడంతో, ఇక అక్కడి నుండి మెల్లగా నటనకు గుడ్ బై చెప్పిన ఛార్మి, పూరి తీస్తున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం మొదలెట్టారు. ప్రస్తతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పూరి తీస్తున్న ఫైటర్ కు కూడా సహ నిర్మాతగా ఉన్న ఛార్మి, తప్పకుండా పూరి, ఈ సినిమాతో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుతారని అంటున్నారు. 

 

ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్ తో తన సినీ, లైఫ్ విషయాలు షేర్ చేసుకునే అలవాటున్న ఛార్మి, ఇటీవల కరోనా వైరస్ కు సంబంధించి ఒక పోస్ట్ పెట్టి, ఆ తరువాత అది అనాలోచితంగా పెట్టానని క్షమాపణ కోరుతూ దానిని డిలీట్ చేసారు. ఇక నిన్న తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక ఫోటో పెట్టారు ఛార్మి, 'ఆమె ఒక డెవిల్, కానీ ఆమెని చూస్తే దేవతలు కూడా ప్రేమలో పడతారు' అంటూ ఫొటోకు సంబంధించి ఆమె చేసిన పోస్ట్ పై పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే నీ అందం ముందు దేవతలు కూడా దిగదుడుపే, అందం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నువ్వే అంటూ కామెంట్స్ చేస్తున్నారు...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: