సాధారణంగా ఒక హీరో ఒక దర్శకుడుతో అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే కొద్దిరోజుల పాటు ఆ కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉంటుంది. మహేష్ వంశీ పైడిపల్లిల మూవీ క్యాన్సిల్ అవ్వడంతో ప్రస్తుతం మహేష్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కాని నాగచైతన్య తన మూవీ క్యాన్సిల్ అయినా ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా మరింత వేగాన్ని పెంచడమే కాకుండా ఏకంగా మహేష్ కు షాక్ ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.


నాగచైతన్య పరుశు రామ్మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి కథ ఫైనల్ అయి నిర్మాత కూడ ఫిక్స్ అయిన తరువాత పరుశు రామ్ కు మహేష్ నుండి పిలుపు రావడంతో చైతన్య మూవీ ప్రాజెక్ట్ పై సందేహాలు మొదలయ్యాయి. అయితే పరుశు రామ్ నిర్ణయం ఇంకా తెలియకుండానే నాగచైతన్య తన మూవీ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసి ఆ మూవీ స్థానంలో మరో రెండు మూవీలను లైన్ లో పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. 


అయితే మహేష్ కలిసి పరుశు రామ్ మళ్ళీ కథను వినిపించినా ఇప్పటికీ మహేష్ తన నిర్ణయం చెప్పకుండా తాను కన్ఫ్యూజ్ అవుతూ పరుశు రామ్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. దీనితో పరుశు రామ్ తో మహేష్ ఎంత వరకు సినిమా చేస్తాడు అన్న విషయం క్లారిటీ లేకపోయినా పరుశు రామ్ చైతన్యను పోగొట్టుకున్నాడు అన్న విషయం క్లారిటీ వచ్చింది. 


ఇది ఇలా ఉండగా ప్రస్తుతం చైతూ తన సినిమాల విషయంలో అనుసరిస్తున్న స్పీడ్ మిడిల్ రేంజ్ హీరోలకు షాక్ ఇస్తోంది. వరసపెట్టి సినిమాలను ఒప్పుకుంటూ రొటీన్ కథలకు భిన్నంగా ఉండే కథలు ఉండేలా చూసుకుంటూ చైతన్య అనుసరిస్తున్న వ్యూహాల వెనుక సమంత సలహాలు ఉన్నాయి అని అంటున్నారు. తన సినిమాలకు సంబంధించి ఎక్కడా గ్యాప్ రాకుండా చూసుకుంటూ కనీసం సంవత్సరానికి తన వైపు నుండి రెండు సినిమాలు ఉండేలా పక్కా ప్లాన్ తో చైతన్య అడుగులు వేస్తున్నాడు అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: