రాజకీయాల్లో ఆశించిన స్థాయి లో విజయం సాధించలేకపోయిన పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ లాంగ్ గ్యాప్‌ తరువాత వకీల్‌ సాబ్‌ సినిమాతో తిరిగి సిల్వర్ స్క్రీన్‌ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ పింక్ తెలుగు రీమేక్‌ లో పవన్‌ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో పవన్‌ కు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ కూడా పూర్తయ్యింది. శ్రీ రామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్‌ నిర్మాత బోని కపూర్‌ సమర్ఫణలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

 

సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్‌. పీరియాడిక్‌ జానర్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌ దొంగగా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ కూడా ఇప్పటికే జరుగుతోంది.  ఈ సినిమాను ఏడాది ప్రథమార్థంలోనే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్‌ స్టార్‌. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాలను కూడా పవన్‌ ఇప్పటికే లైన్‌ లో పెట్టినట్టుగా తెలుస్తోంది.

 

సినిమా తరువాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేసే ఆలోచలో ఉన్నాడు పవన్‌. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ పొలిటికల్ మూవీకి పవన్‌ ఓకె చెప్పాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా తరువాత తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు పవన్‌. ఈ సినిమాలన్నీ 2021 చివరలోగా పూర్తి చేేసే ఆలోచనలో ఉన్నాడు పవన్‌. ఆ తరువాత  తిరిగి రాజకీయాల మీద దృష్టి పెట్టనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: