గతంలో తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య సంచలాన్ని సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. రెండేళ్ల క్రితం తన కూతురు అమృత వర్షిణి ప్రేమ వివాహం చేసుకుంది. ఆ ఆగ్రహంతో కిరాయి రౌడీ ముఠాతో అల్లుడు ప్రణయ్ ను అత్యంత దారుణంగా హత్య చేయించాడు మారుతీరావు. అప్పట్లో అమృత ఫిర్యాదుతో మారుతీరావును అరెస్ట్ చేశారు. 

 

 

మరోవైపు కూతురు దూరం అయిందని ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ప్రణయ్‌ హత్య కేసులో బలమైన సాక్ష్యాలు లభించడంతో మారుతీరావుకు శిక్ష పడడం ఖాయం అనే వార్తలు కూడా వచ్చాయి. దానికి తోడు మారుతీరావుకు ఉరిశిక్ష విధించాలనే డిమాండ్ కూడా ఆ మధ్య బాగా వినిపించింది. ఇంకో వైపు గత కొంతకాలంగా మారుతీరావు, ఆయన సోదరుడి మధ్య వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 

 

 

పరువు పోయింది.. ఇక సమాజంలో తిరగలేక పోతున్నాం అని తన ఆస్తిని తన కుమారుల పేరు మీద రాయాలని మారుతీరావుపై ఆయన సోదరుడు ఒత్తిడి చేసినట్టు ప్రచారం సాగుతోంది. మారుతీరావు గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఏదైనా పని ఉంటేనే మిర్యాలగూడకు వెళ్లి మళ్లీ హైదరాబాద్ కే తిరుగు ప్రయాణం పడుతున్నారని తెలుస్తోంది.  

 

 

ఇవన్నీ ఇలా ఉంటే.. తాజాగా మిర్యాలగూడలోని ఆయన షెడ్‌ లో ఓ మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. ఇక, పోలీసుల ఒత్తిడి  ఆయనపై తీవ్రంగా ఉందని మారుతీరావు భార్య ఆరోపిస్తోంది. ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరతాబాద్‌ లోని ఆర్యవైశ్య భవన్‌ లో అనుమానాస్పద స్థితిలో మారుతిరావు మృతిచెందినట్టు తెలుస్తోంది. మొదట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరిగినా తర్వాత మాత్రం ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అయితే, మారుతీరావు మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: