అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య ‘జోష్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఇప్పటి వరకు పదేళ్లు దాటినా సరైన హిట్ అందుకోలేక పోయాడు.  అయినా తాను హీరోగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నాడు.  గత ఏడాది మజిలీ, వెంకిమామ తో మంచి హిట్స్ అందుకున్నాడు నాగ చైతన్య. సమంతతో పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కలిసి నటించిన మజిలీ మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.  దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్న లో మరో చిత్రం ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ చిత్రం చేస్తున్నారు. 

 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్నది.   ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ మద్య రిలీజ్ అయ్యింది.   మంచి లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారట.  ఈ మూవీ తర్వాత వెంటనే గీతాగోవిందం ఫేమ్ పరుశరామ్ తో ఓ చిత్రంలో నటించబోతున్నారట.  అంతే కాదు ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నాగ చైతన్య చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే పరశురామ్ మహేశ్ బాబు ప్రాజెక్ట్‌తో బిజీ అవటంతో చైతన్య మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్‌కి  గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట.

 

అయితే ఇప్పుడు సమంతకు ఓ బేబీ చిత్రంతో మంచి విజయం అందుకున్న నందితా రెడ్డితో ఓ మూవీలో నటించబోతున్నాడ.  అంతే కాదు..  అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి ఫీల్ గుడ్  చిత్రం అందించిన విక్రమ్ కుమార్ తో దిల్ రాజు నిర్మించే మరో  చిత్రం...  చైతు కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపిస్తున్నారట. ఇక దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి 'థాంక్యూ' అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: