స్టార్ హీరోల అభిమానులకు వాళ్ళ విశేషాల గురించి తెలుసుకోవడం తెగ ఇంట్రస్ట్ చూపిస్తా ఉంటారు సామాన్య ప్రజలు. మరి అలాంటిది అందులోనూ టాలీవుడ్ అందగాడైన మహేష్ గురించి అయితే ఆ ఆశక్తి మరికాస్త ఎక్కువగానే ఉంటుంది. ఐతే టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఉన్న మహేష్, పవన్ కొన్ని ఫీట్స్ కి ఇంకా చాలా దూరంలో ఉన్నారు. మహేష్ అభిమానులు ఎప్పటి నుండో రాజమౌళితో ఆయన పాన్ ఇండియా మూవీ చేయాలని కోరుకుంటున్నారు. అయితే అది మాత్రం కుదరడం లేదు. చిరు-కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో మహేష్ బాబు ఓ పాత్రలో చేయనున్నారని ప్రచారం చాలా గట్టిగా జరుగుతుంది.
ఈ రోల్ చరణ్ చేయాల్సివుండగా మహేష్ తో చేయించాలని నిర్ణయించారని వార్తలు వస్తున్నాయి. మరలా ఈ రోల్ చరణ్ చేస్తున్నారు ..మహేష్ కాదు అంటున్నారు. ఇక ఈ రోజు అందిన తాజా సమాచారం ఏమిటంటే మహేష్తో పాటు నందమూరి హీరో ఎన్టీఆర్ కూడా చేస్తున్నట్లు సమాచారం అందింది. అయితే అది నిజమేనా లేక మహేష్ను నెట్టేసి ఆ పాత్రలోకి ఎన్టీఆర్ వస్తున్నారా అన్న దాని పై మాత్రం ఇంకా ఎవరికి అధికారిక ప్రకటన అయితే రాలేదు.
ఇక మహేష్ ఈ చిత్రం కోసం దాదాపు 40 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మరి అంత డబ్బులు ఇచ్చి మహేష్ని పెట్టుకునే ఆలోచన కొరటాల టీమ్కి లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని పై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ ఈ రోజు ఉమెన్స్ డేని సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆ ముగ్గురు లేడీస్ తన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. ఎవరా ముగ్గురు అని ఆలోచిస్తున్నారా... అదేనండి ఒకరు వాళ్ళ అమ్మగారు ఇందిరాదేవి, మరొకరు తన సతీమణి నమ్రతశిరోద్కర్, మూడు తన కుమర్తె క్యూట్ గర్ల్ సితార అని ఆయన తెలిపారు. అంతేకాక మహేష్కి మొదటి నుంచి కూడా ఆమె తల్లి ఇంద్రాదేవి అంటే చాలా అమితమైన ప్రేమ.