ఇటీవలె ప్రభాస్ నాగశ్విన్తో సినిమా ఎనౌన్స్చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ గర్వపడేలా ఈ సినిమాను తెరకెక్కిస్తానని నాగ్ అశ్విన్ అన్నారు. దీనిని ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ఇక చిరుకి నాగఅశ్విన్ గతంలో ఓ కథ చెప్పారట. ఈ సినిమాను తాను చేయడం కంటే ప్రభాస్ చేస్తే బావుంటదని చిరు చెప్పడంతో నాగ్ అశ్విన్ ప్రభాస్కి కథ చెప్పారట. దాంతో ఆయన ఓకే చేశారు. ఇక చిరంజీవి రిఫర్ చేసిన స్క్రిప్ట్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో ప్రభాస్కి కూడా తెలుసు. అందుకే మరో క్షణం ఆలోచించకుండా సినిమాను ఓకే చేసేసారట ప్రభాస్.
ప్రస్తుతం రాధాకృష్ణ సినిమాతో ప్రభాస్ బిజీగా ఉన్నారు కాబట్టి ఈ సినిమా పూర్తైన వెంటనే నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తారు. రాధాకృష్ణ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘రాధే శ్యాం’, ‘ఓ డియర్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మరి ఈ వారం ప్రభాస్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కరోనా వైరస్ ప్రభావంతో మోహానికి మాస్క్ పెట్టుకుని ఖతార్ వెళ్ళేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ట్రిప్ ఏదో షూటింగ్కి సంబంధించి వెళ్ళారు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే..ఆయన ఏదో పర్సనల్ పని మీద వెళ్ళినట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం ప్రభాస్ ఏ సినిమా చేసినా అది ప్యాన్ ఇండియా సినిమానే తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రభాస్ మాములు సినిమాలు తియ్యరా అని చాలా మంది ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించే చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టాల్సి ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత ఓ లవర్బాయ్గా చూడబోతున్న ఫ్యాన్స్ ఈసినిమా ఎప్పుడెప్పుడు వచ్చుద్దా అని వేచి చూస్తున్నారు. పైగా పూజాతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్ వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటదా అని ఫ్యాన్స్లో ఆత్రుత ఎక్కువయింది. అలాగే సాహో చిత్రంలో ప్రభాస్ గెటప్కి పెద్దగా మార్కులు పడలేదు. మరి ఈ చిత్రంలో అయినా ఆయన మంచి లుక్తో కనిపిస్తే ఫ్యాన్స్ ఖుషీ అయిపోతారు.