అక్కినేని నట వారసుడు, కింగ్ నాగార్జున తనయుడు నాగ చైతన్య మంచి జోష్ లో ఉన్నాడు. మజిలీ హిట్ తర్వాత వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా తర్వాత పరశురామ్ దర్శకత్వంలో నాగేశ్వర రావు అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు.

 

 

అయితే.. ఈ సినిమా తర్వాత సినిమాను కూడా ఇప్పుడు లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. మనం సినిమాతో అక్కినేని కుటుంబానికి మరుపురాని సినిమాను ఇచ్చిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ లో ఓ వార్త రౌండ్ అవుతోంది. ప్యూర్ లవ్ సబ్జెక్టుతో విక్రమ్ చెప్పిన కాన్సెప్ట్ కి నాగ చైతన్య ఇంప్రెస్ అయ్యాడని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేయాలని కూడా విక్రమ్ కు చెప్పాడని అంటున్నారు. ఈ సినిమాకు థాంక్యూ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ అయితే చాలా క్యాచీగా ప్రేక్షకులకు చేరువ అవుతుందని విక్రమ్ కె కుమార్ భావిస్తున్నాడట. ఇందుకు చైతూ కూడా ఓకే చెప్పాడని అంటున్నారు.

 

 

దీనిపై పూర్తి అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది. మరోవైపు విక్రమ్ పనితనంపై అక్కినేని అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మనం తప్పితే మరే సినిమాతోనూ కనీసం హిట్ కొట్టలేకపోయిన విక్రమ్ తో చైతూకు సినిమా ఎందుకు అంటున్నారు. అఖిల్ తో చేసిన ఛలో కూడా ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలో చైతూకు విక్రమ్ తో సినిమా అవసరమా అంటున్నారు. మరోవైపు నందిని రెడ్డి దర్శకత్వంలో కూడా చైతూ సినిమా చేయనున్నాడని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: