ఆ పని రామ్ చరణ్ చేస్తున్నాడంటే ఆశ్చర్యం వేస్తోంది. మెగా ఫ్యాన్సే కాదు.. ఎవరికీ నమ్మశక్యంగా లేదు. కొడుకు తీసుకున్న నిర్ణయం చూసి చిరంజీవి కూడా షాక్ అవుతున్నాడు. ఎప్పుడూ లేనిది.. రామ్ చరణ్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నాడు. 

 

ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కు కమిట్ అయ్యాడు. సమ్మర్ షూటింగ్ కూడా మొదలైపోతోంది. మరి రామ్ చరణ్ ఎవరి డైరెక్షన్ లో నటిస్తాడన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. అయితే.. ఓ దర్శకుడితో కథా చర్చలు నడుస్తున్నాయన్న టాక్ మెగా వర్గాల్లో నడుస్తోంది. అదీ కొత్త దర్శకుడితో అనేసరికి ఇదొక హాట్ టాపిక్ అయిపోయింది. 

 

రామ్ చరణ్ ఏంటి.. డెబ్యూ డైరెక్టర్ తో నటించడం ఎంటి.. అనే డౌట్ చాలామందికి వచ్చింది. ఎందుకంటే.. చెర్రీ ఇప్పటి వరకు 13 సినిమాలు చేస్తే.. కొత్త దర్శకుడితో ఒకసారి కూడా పనిచేయలేదు. నిర్మాతగా రెండు సినిమాలు తీసినా.. వినాయక్, సురేందర్ రెడ్డి లాంటి సీనియర్స్ నే తీసుకున్నాడు. అలాంటి చెర్రీ డెబ్యూ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా.. అనే అనుమానం లేకపోలేదు. 

 

మెగా కాంపౌండ్ లో రామ్ చరణ్ దర్శకుడిగా ప్రదీప్ పేరు వినిపిస్తోంది. ఆల్ రెడీ కథ గురించి చర్చలు కూడా నడుస్తున్నాయనేది టాక్. ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ చేసిన తర్వాత డెబ్యూ డైరెక్టర్ ని ఎంచుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉందట. ట్రిపుల్ ఆర్ ఎక్స్ పెక్టేషన్స్ ను తగ్గించేందుకు కొత్త దర్శకుడిని ఎంచుకున్నాడంటున్నాయి మెగా వర్గాలు. మొత్తానికి రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీనికి చిరంజీవే షాక్ కు గురవుతున్నాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త దర్శకుడితో సినిమా అనే సరికి మెగా అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: