టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒక్క అవకాశం వస్తే చాలు... వాళ్ళు సినిమా చేయడానికి ముందుకి వస్తారు. దర్శకులు అయితే మంచి కథలతో సినిమాలు చేయడానికి నిర్మాతలు అయితే హీరోకి దమ్ము ఉంటే మాత్రం వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య టాలీవుడ్ లో స్టార్ హీరోలు కమర్షియల్ హీరోల అవతారం ఎత్తుతున్న నేపధ్యంలో హీరోలకు డిమాండ్ కూడా పెరుగుతుంది. వందల కోట్ల రూపాయల వసూళ్లను టార్గెట్ గా పెట్టుకుని మరీ పని చేస్తున్నారు. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి వారికి మంచి డిమాండ్ ఏర్పడింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ సినిమా. ఇది పక్కన పెడితే ఈ సినిమా కోసం దర్శకుడు రాజమౌళి ఎంత సీరియస్ గా ఉన్నారో అందరికి తెలిసిన విషయమే. కనీస౦ వేరే సినిమా గురించి కూడా ఆలోచన చేయడం లేదు ఈ స్టార్ దర్శకుడు. 

 

అయితే ఇటీవల రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వద్దకు కొందరు దర్శకులు నిర్మాతలు వచ్చి ఈ సినిమా చేస్తూనే తమ సినిమాలు చెయ్యాలని ముందు కథలు వినాలని కోరారట. ఈ విషయం రాజమౌళికి తెలియడం తో వారిపై సీరియస్ అయినట్టు సమాచారం. హీరోలు చేసేది లేదు అని చెప్తున్నా కావాలనే వాళ్ళు పదే పదే వస్తున్నారని గ్రహించిన రాజమౌళి... ఇటీవల పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడట. తన ప్రాజెక్ట్ ని కొందరు కావాలని ఇబ్బంది పెడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని తనను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టంగా చెప్పాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: