టాలీవుడ్ టాప్ హీరో ఎవరు అనే ప్రశ్నకు చాన్నాళ్లుగా సమాధానం దొరకడం లేదు. బాక్సాఫీస్ కూడా నెంబర్ వన్ ర్యాంక్ విషయంలో కొంచెం కన్ ఫ్యూజన్ లో ఉంది. అయితే ఈ అనుమానాలన్నింటినీ తీర్చేందుకు ఓ యంగ్ హీరో బయల్దేరాడు. పాన్ ఇండియన్ మూవీస్ తో తెలుగు నాట టాప్ లేపుతానంటూ వందల కోట్ల సినిమాలు తీస్తున్నాడు. 

 

చిరంజీవి లాంగ్ బ్రేక్ తీసుకోవడం, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్లడంతో నెంబర్ వన్ ర్యాంక్ కొంచెం రెస్ట్ మోడ్ లోకి వెళ్లింది. అయితే కొంతకాలంగా ఖాళీగా ఉన్న నెంబర్ వన్ ని అందుకోవడానికి స్కెచ్చులేస్తున్నాడు ప్రభాస్. పాన్ ఇండియన్ మూవీస్ తో టాప్ చైర్ ని అందుకోవాలనుకుంటున్నాడు. భారీ బడ్జెట్ మూవీస్ తో టాప్ ఛైర్ ని టార్గెట్ చేస్తున్నాడు. 

 

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. నార్త్ లోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రేజ్ తో మార్కెట్ పెంచుకోవడానికి పాన్ ఇండియన్ మూవీస్ లో నటిస్తున్నాడు. తెలుగు మార్కెట్ తో పాటు, నార్త్ నీ ఆకట్టుకునే కథలకు సైన్ చేస్తున్నాడు. ఇప్పటికే సాహో సినిమాని మల్టీ లింగ్వల్ గా రిలీజ్ చేసి ఉత్తరాదిలో స్ట్రాంగ్ అయ్యాడు. 

 

సాహోతో మొదలైన పాన్ ఇండియన్ ఫ్లాప్స్ ని ఇప్పుడు మరింత పెంచాడు ప్రభాస్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న లవ్ స్టోరీని మల్టీలింగ్వల్ గా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీకి 200కోట్లకుపైగా బడ్జెట్ కేటాయించారని టాక్. ఇక ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ ఫాంటసీ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాను 200కోట్లతో నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. 

 

మార్కెట్ కింగ్ గా నిలిచినోళ్లే టాప్ హీరోలు. వందల కోట్లు కలెక్ట్ చేసిన స్టార్లే నెంబర్ వన్ హీరోలు అవుతారు. ఇప్పుడు ప్రభాస్ కూడా ఇలాగే మార్కెట్ పెంచుకుంటున్నాడు. వందల కోట్ల టార్గెట్ చేస్తున్నాడు. దీంతో ప్రభాస్ టాలీవుడ్ టాప్ హీరోగా మారుతున్నాడనే టాక్ వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: