మంచు ఫ్యామిలీ అంటే అందులో మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి  మంచు అంతా వస్తారు. వీరంతా సినిమాల్లో ఉన్నారు. ప్రాజెక్టులూ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వీళ్ళ కెరీర్ సరిగ్గా సాగడంలేదు. వారసులుగా ఎంట్రీ ఇచ్చి ఏళ్ళు అవుతున్నా సరైన హిట్ మాత్రం కొట్టలేదన్న బాధ తండ్రి మోహన్ బాబులో ఉంది.

 

ఇదిలా ఉండగా మోహన్ బాబు తాజాగా భక్త కన్నప్ప సినిమా చేస్తానంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అది కూడా మహా శివరాత్రి వేళ శ్రీకాళహస్తిలో ఆ ప్రకటన రావడంతో టాలీవుడ్లో సంచలనం  అయింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా దీన్ని తీయాలనుకుంటున్నట్లుగా కూడా మోహన్ బాబు చెప్పాడు.

 

ఇక ఇందులో హీరో రోల్ విష్ణు చేస్తాడని కూడా చెప్పేశాడు. ఓ విధంగా భక్త కన్నప్ప మూవీ క్రిష్ణంరాజు ఇంటిలోనిది. తన తరువాత ప్రభాస్మూవీ చేయాలని క్రిష్ణంరాజు గట్టిగా  కోరుకున్నాడు. అయితే ప్రభాస్ దాన్ని డ్రీం ప్రాజెక్టుగానే ఉంచేశాడు.

 

ఇపుడు విష్ణు టచ్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం నటుడు కం డైరెక్టర్ తనికెళ్ళ భరణి. ఆయన శివభక్తుడు. దాంతో మొదట ప్రభాస్ తోనే తీయాలనుకున్నాడు. కానీ అక్కడ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో మంచు క్యాంప్ వైపు వెళ్ళాడు. ఇదంతా జరిగి మూడేళ్ళు అయింది. ఇపుడు పాన్ ఇండియా మూవీస్ టైం.

 

పైగా విష్ణు కూడా తన సత్తా చాటాలనుకుంటున్నాడు. దాంతో బిగ్ స్క్రీన్ మీద మూవీ కావాలనుకుంటున్నాడు. దానికి భరణి నో చెప్పెశాడని టాక్ నడుస్తోంది. తాను భక్త కన్నప్ప కళాత్మకంగా తీయగలను తప్ప హాలీవుడ్ రేంజి కాదని తేల్చేయడంతో విష్ణు డైలామాలో పడ్డాడుట. అయినా డేరింగ్ గా ఇపుడు హాలీవుడ్ టెక్నీషియన్లను పెట్టుకుని అయినా ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నాడు. మొత్తానికి భక్త కన్నప్ప ఎన్ని తిప్పలు పెడుతున్నాడో కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: