టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్, రామ్చరణ్ కలయికలో నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆప్టర్ కాంబినేషన్తో నిర్మాత డీవీవీ దానయ్య `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 350కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చిత్రీకరణ స్టేజ్లోనే ప్రీరిలీజ్ స్టేజ్లోనే రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదని చెప్పాలి.
ఇదిలా వుంటే ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య తన తనయుడు కల్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. తనకు తెలిసిన క్రేజీ దర్శకులకు భారీ ఆఫర్లు కూడా ఇచ్చారట. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే ఇందులో మారుతి పేరు కూడా వినిపించింది. ఎందుకనోగాని మారుతి కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదని తెలిసింది. కానీ ఏదీ ఇప్పటి వరకు రెఢీ అవ్వలేదు. మెటీరియలైజ్ కాలేదు. అయినా దానయ్య ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. తన కొడుకు కోసం చాలా కష్టపడి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాజాగా కల్యాణ్ దాసరిని శ్రీవాస్ దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
కాన్సెప్ట్ బేస్డ్ క్రైమ్ కామెడీగా ఈ సినిమా వుండబోతోందని సమాచారం. ఈ నెల నుంచే అ చిత్రాన్ని హైదరాబాద్లో మొదలు పెడుతున్నారని తెలిసింది. దానయ్య సొంత బ్యానర్లోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. మరి ఓ పక్క ఆర్.ఆర్.ఆర్ చిత్రం బిజీలో ఉంటూనే కొడుకు కోసం రిస్క్ని తీసుకుంటున్నాడు దానయ్య. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాల్ని నిర్మాత దానయ్యనే వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో హీరోయిన్ మిగతా విషయాలన్నీ తెలియాల్సి ఉంది. చివరికి దానయ్య కొడుకు ఎలా సక్సెస్ సాధిస్తాడో చూడాలి. అలాగే మొత్తానికి ఎవరో ఒక దర్శకుడు అయితే సెట్ అయ్యాడు.