యువ సామ్రాట్ నాగ చైతన్య ,శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరి. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. దాంతో ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉండగా ఇటీవల విడుదలైన ఏ పిల్ల మ్యూజికల్ ప్రివ్యూ యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకొని ఆ అంచనాలను మరింతగా పెంచింది. ఇక ఏ పిల్లా ఫుల్ లిరికల్ సాంగ్ ఈనెల 11న సాయంత్రం 4:05 గంటలకు విడుదలకానుంది. ఇదిలావుంటే ఏప్రిల్ లో ఈ సినిమాను థియేటర్లలో కి తీసుకురావాలనుకున్నారు కానీ షూటింగ్ ఆలస్యంగా పూర్తి కానుండడంతో  విడుదల వాయిదా పడింది. ఇక ఇప్పుడు మే 29న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే ఈ విడుదల తేది పై క్లారిటీ రానుంది.
 
ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ ధరకు స్టార్ మా సొంతం చేసుకుందని సమాచారం. నూతన సంగీత దర్శకుడు పవన్ సంగీతం అందిస్తుండగా ఏషియన్ సినిమాస్ ,అమిగోస్ క్రియేషన్స్ ఈచిత్రాన్ని  సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి గత ఏడాది మజిలీ, వెంకిమామ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి  ఫుల్ ఫామ్ లోకి వచ్చిన చైతన్య , లవ్ స్టోరి తో హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.
 
ఈసినిమా తరువాత చైతన్య రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అందులో ఒకటి గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్ లో కాగా మరొకటి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్నాడు. విక్రమ్-నాగ చైతన్య కాంబినేషన్ లో రానున్న సినిమా కు థాంక్యూ అనే టైటిల్ పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించాల్సి వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: