గబ్బర్ సింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మైమరపించిన పవన్ కళ్యాణ్ మరియు శృతి హాసన్ జోడి మరొకసారి తెరమీద కనువిందు చేయనున్నారు. అన్నీ కుదిరితే ఒకటేమి కర్మ రెండు సినిమాల్లో వీరిద్దరిని జంటగా చూడొచ్చు. ఇప్పటికే గబ్బర్ సింగ్ మరియు కాటమరాయుడు చిత్రాల్లో పవన్ తో కలిసి నటించిన శ్రుతిహాసన్ గబ్బర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని తెలుగులో భారీగా ఛాన్సులు కొట్టేసింది. తర్వాత వచ్చిన కాటమరాయుడు యావరేజ్ చిత్రంగా నిలిచింది.

 

IHG

 

ఇకపోతే వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని వాడుకుందామని దర్శకుడు వేణు శ్రీరామ్ మరియు నిర్మాత దిల్ రాజు శ్రుతిహాసన్ ను వకీల్ సాబ్ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కోసం అడిగారట. అయితే శృతి ఇంకా అందుకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ వారు మాత్రం విషయంలో చాలా కచ్చితంగా ఉన్నారని తెలుస్తోంది. శృతి చేతిలో ఇప్పుడు పెద్దగా సినిమాలేవీ లేవు. అదీ కాకుండా పవన్ కళ్యాణ్ చిత్రం కమ్ బ్యాక్ చిత్రం కాబట్టి తను అవకాశాన్ని వదులుకోవద్దు అని అనుకుంటున్నారు.

 

IHG

 

ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కు భారీ బ్రేక్ ఇచ్చిన హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పవర్ స్టార్ హీరోగా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గబ్బర్ సింగ్ సినిమాలో శ్రుతిని హీరోయిన్ గా పెట్టి తీసిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ చిత్రంలో కూడా తననే లీడింగ్ లేడీ గా ఎంచుకున్నాడు అని సమాచారం. ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన హాసన్ క్రాక్ చిత్రంలో నటిస్తోంది. తను అనుకుంటే డేట్లు సర్దుబాటు చేసుకుని పవన్ సరసన రెండు చిత్రాల్లో నటించే అవకాశం లేకపోలేదు. చూద్దాం పవర్ స్టార్ అభిమానులకు ఎలా రాసిపెట్టి ఉందో.

మరింత సమాచారం తెలుసుకోండి: