తెలుగు తెర మీద అందమైన పాత్రలు పోషించిన నటుల్లో జయసుధ , ప్రకాష్ రాజ్ ఒకరు. వీళ్ళు ఇద్దరు కలిసి నటించిన సినిమాలు దాదాపు 10 పైనే ఉన్నాయి. పల్లెటూరు అమ్మా నాన్నా ఏ విధంగా ఉంటారో వీరు ఇద్దరు అదే విధంగా కలిసి కనిపించారు. రవితేజా హీరోగా వచ్చిన అమ్మా నాన్న తమిళ అమ్మాయి సినిమాలో వీళ్ళు భార్యా భర్తలుగా కనిపించారు. వీళ్ళు కలిసి ఆ సినిమాలో ఎక్కువ సేపు కనపడకపోయినా సరే వారి పాత్రలు మాత్రం చెరగని ముద్ర వేసాయి. ఒకరిపై ఒకరు పరోక్షంగా ప్రేమను చాటుకున్నారు ఆ సినిమాలో. 

 

మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా వీళ్ళు ఇద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాలో ఈ కాంబినేషన్ బాగా హిట్ అయింది. ఇక గోవిందుడు అందరి వాడేలే సినిమాలో కూడా ఈ జోడి అలరించింది. ముఖ్యంగా పల్లెటూర్లో అమ్మా నాన్నా ఏ విధంగా ఉంటారు, వారి ఆలోచనలు గాని, వారి ప్రవర్తన గాని ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఇద్దరు కళ్ళకు కట్టినట్టు చూపించారు తమ సినిమాల్లో. దీనితో దర్శకులు కూడా వీరికే మొగ్గు చూపుతున్నారు. 

 

ఇద్దరూ నట దిగ్గజాలే... దీనితో వీళ్ళు ఇద్దరూ కలిసి ఫ్రేం లో కనపడితే చాలు ఆ సీన్ పండటం ఖాయం అనే నమ్మకం దర్శకులకు కూడా వచ్చింది. శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన శతమానం భవతి సినిమాలో కూడా వీరి కాంబినేషన్ అలరించింది. ఆ సినిమాలో పిల్లల కోసం ఎదురు చూసే తల్లి తండ్రులుగా వాళ్ళు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించారు. వాళ్ళ మధ్య ఆ సినిమాలో ప్రతీ సన్నివేశం కూడా హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. ఆ విధంగా ఈ జోడి తమదైన ముద్ర వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: