పోసాని కృష్ణ మురళి... రచయితగా దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, కమెడియన్ గా, విలన్ గా, పోలీసు గా సినిమాల్లో ఈయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో పాత్రలు ఉంటాయి. ఎలాంటి పాత్రలో అయినా సరే జీవిస్తారు అనే పేరు ఉంది ఆయనకు. ఆయన కనపడితే చాలు ఆ పాత్ర ఆ సీన్ కచ్చితంగా హైలెట్ అవుతుంది. ఎలాంటి సన్నివేశంలో అయినా సరే ఆయన తెర మీద తనదైన నటనతో ఆకట్టుకునే వారు. దర్శకుడిగా కూడా ఆయన మంచి హిట్ సినిమాలు చేసారు. అవి హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా చేసారు. 

 

ఇక ఇదిలా ఉంటే పోసాని కృష్ణ మురళి... ఈశ్వరి రావు కలిసి నానీ హీరోగా వచ్చిన నేను లోకల్ సినిమాలో వీళ్ళు భార్యా భర్తలుగా కలిసి నటించారు. ఆ సినిమాలో ఈ జోడీ సూపర్ హిట్ అయింది. నానీ కి తల్లి తండ్రులుగా నటించారు. భర్త అనారోగ్యంతో ఉంటే భార్య కుటుంబాన్ని పోషించడం కొడుకుని చదివించే విధంగా ఈ సినిమాలో చూపించారు. వీరు చేసిన కామెడి హైలెట్ గా నిలిచింది ఆ సినిమాలో. అంతకు ముందు వీరు నటించినా సరే వీరికి మాత్రం ఆ సినిమాతో భార్యా భర్తల పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది అనే చెప్పాలి. 

 

ఇక వారు చేసిన ప్రతీ సన్నివేశం కూడా ఆ సినిమాలో కామెడి పండించింది. కీర్తి సురేష్ ని కోడలు గా తెచ్చుకోవడానికి పోలీస్ స్టేషన్ లో, ఇంట్లో చేసిన కామెడి, మధ్య తరగతి వాళ్ళు ఏ విధంగా ఉంటారు. ఇలా అన్నీ కూడా ఆ సినిమాలో మెప్పించాయి ప్రేక్షకులను. ఇద్దరూ కూడా అగ్ర నటులే కావడం విశేషం. ఒకరి పక్కన మరొకరు ఆ విధంగా ఇమిడిపోయారు ఆ సినిమాలో. కాగా పోసాని ఇప్పుడు రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు కనపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: