‘అల వైకుంఠపురములో’ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ కు జూనియర్ తో తీయబోతున్న మూవీకి సంబంధించిన కథ విషయంలో అనేక సందేహాలు ఏర్పడుతున్నట్లు సమాచారం. బయటకు వినిపిస్తున్న సమాచారం మేరకు ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఫైనల్ కావడంతో పాటు ఆస్టోరీ లైన్ ‘మంత్రిగారి వియ్యంకుడు’ మూవీని పోలిన విధంగా త్రివిక్రమ్ డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.


అయితే ఈ లైన్ కు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ కు కొన్ని అనుకోని సమస్యలు ఏర్పడుతున్నట్లు టాక్. జూనియర్ ఎన్టీఆర్ ఉన్న టాప్ హీరో ఇమేజ్ రీత్యా ఈమూవీలో కామెడీ యాక్షన్ సన్నివేశాలు సెంటిమెంట్ అన్నీ కలగలపి ఉండేలా తీర్చిదిద్దాలని త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నాడు. 


త్రివిక్రమ్ అనుకున్న స్టోరీ లైన్ లో ఈ మూడు అంశాలు కుదరక పోవడంతో పాటు ఒకనాటి ‘చెల్లెలు’ సెంటిమెంట్ కథను ఇప్పుడు మళ్ళీ చెపితే నేటితరం ప్రేక్షకులు చూస్తారా అన్న భయం కూడ త్రివిక్రమ్ ను వెంటాడుతున్నట్లు టాక్. ఒకవైపు జూనియర్ సలహాలతో ఈమూవీలో కామెడీ ఎలిమెంట్ ను బాగా పెట్టాలని ప్రయత్నిస్తున్నా ‘అల వైకుంఠపురములో’ మూవీ కథ విషయంలో త్రివిక్రమ్ పెన్ వేగంగా పరుగులు తీసిన విధంగా జూనియర్ స్క్రిప్ట్ విషయంలో పరుగులు తీయడంలేదు అని అంటున్నారు.


ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ ఆలోచనలో ఉన్న ‘అయినా హస్తినకు పోయిరావలె’ అన్న టైటిల్ విషయంలో ఇప్పటికి త్రివిక్రమ్ కు వచ్చిన అభిమానుల నుంచి వచ్చిన స్పందన కూడా అంత ఆశాజనకంగా లేదు అన్న లీకులు వస్తున్నాయి. దీనితో ప్రస్తుతం జూనియర్ కు కథ వ్రాసే విషయంలో త్రివిక్రమ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ తరువాత త్రివిక్రమ్ జూనియర్ మూవీ కావడంతో కథ విషయంలో ఏచిన్న పొరపాటు జరగకూడదని త్రివిక్రమ్ ఆలోచనలు ఉండటంతో మాటల మాంత్రికుడుకి ఇలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడింది అన్న మాటలు వినిపుస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: