కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. సెట్ లోకి అడుగు పెట్టకముందునుంచీ .. సినిమా ప్యాకప్ వరకూ ఖర్చులన్నీ ప్రొడ్యూసర్ల మీదే వేస్తారు. తీరా సినిమా అయిపోయాక ప్రమోషన్లకు  రమ్మంటే మాత్రం తప్పించుకుతిరుగుతారు. ఇలా ఈ మద్య ప్రమోషన్ల , రెమ్యూనరేషన్ల్ విషయంలో హీరోయిన్లకు, ప్రొడ్యూసర్లకు మధ్య పెద్ద రచ్చే జరుగుతోంది. 

 

రెమ్యూనరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తున్న హీరోయిన్స్. హీరోల కన్నా మాకు తక్కువ రెమ్యూనరేషనే కదా అంటారు. తీరా మేకప్ మ్యాన్, డ్రైవర్ , అసిస్టెంట్ , హెయిర్ డ్రెస్ అంటూ నానా రకాల ఖర్చులన్నీ ప్రొడ్యూసర్ల మీదే వేస్తారు అని హీరోయిన్ల మీద కంప్లైంట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. అశ్వధ్దామ నిర్మాతకు మెహరీన్ కు మధ్య కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఇలాంటి గొడవే జరిగింది. 

 

నాగశౌర్య, మెహరీన్ జంటగా అశ్వద్దామ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నాగశౌర్య సొంత బ్యానర్  ఐరా ప్రొడక్షన్స్ లో తెరకెక్కింది. ఈ సినిమాకు సంబందించి షూటింగ్ తర్వాత కొన్ని పర్సనల్ రీజన్స్ తో వెళ్లిపోయిన మెహరీన్ .. ప్రమోషన్స్ కోసం అని మళ్లీ హైదరాబాద్ వచ్చి ప్రమోషన్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసింది. వీటికోసం హోటల్ ఖర్చులు, లాండ్రీ, అసిస్టెంట్స్ ఖర్చులు ఏవీ ఐరా క్రియేషన్స్ పే చెయ్యలేదని , అన్నీ తనే సొంతంగా తన మేనేజర్ తో చెప్పి హోటల్ బిల్స్ అన్నీ సెటిల్ చేయించానని సోషల్ మీడియాలో పెద్ద మెసేజ్  పెట్టింది. అయితే ప్రొడ్యూసర్లు మాత్రం కొంతవరకూమేం చెల్లించాం అని చెప్తున్నారు. 

 

రీసెంట్ గా త్రిష, పరమపదం తమిళ్ సినిమా ప్రమోషన్లో పాల్గొనకపోవడంతో నిర్మాతకి కి కోపం వచ్చింది. చెన్నై లో పరమపదం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి త్రిష రానందుకు ఫైర్ అయిన ప్రొడ్యూసర్స్ గిల్డ్  కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో సినిమా ప్రమోషన్ కి రాకపోతే త్రిష రెమ్యూనరేషన్ లో సగం వెనక్కి తీసుకుంటామంటూ హెచ్చరించింది  నిర్మాతల మండలి. నయనతార చాలా కాలంగా ప్రమోషన్ల విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: