అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు. యూత్ లో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. దర్శకుడు సందీప్ రెడ్డికి బాలీవుడ్ లోనూ అవకాశం వచ్చింది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాని కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. 

 

అర్జున్ రెడ్డి సినిమాతో హీరోకి, దర్శకుడికి వచ్చినంత పాపులారిటీ హీరోయిన్ గా నటించిన షాలినీ పాండేకి రాకపోవడం గమనార్హం. షాలినీ పాండేకి అంతగా గ్లామర్ లేకపోయినా నటనపరంగా ఆమె అదరగొట్టింది. థియేటర్ ఆర్టిస్ట్ అయిన షాలినీ అర్జున్ రెడ్డి సినిమాలో అద్భుతంగా నటించింది. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది గ్లామరస్ ఇండస్ట్రీ కాబట్టి ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. మహానటిలో ఒక చిన్న పాత్ర వచ్చినా దానికి పెద్ద పేరు రాలేదు.

 

ఇక హీరోయిన్ గా కళ్యాణ్ రామ్ తో ౧౧౭, రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే అనే చిత్రాలు చేసినా గుర్తింపు రాలేదు. నటన పరంగా తనని తాను ప్రూవ్ చేసుకున్న షాలినీకి అవకాశాలు రాకపోవడం విచిత్రమే అయినా ఆ విషయాన్ని కాదనలేం. అయితే తెలుగులో అవకాశాలు లేని ఈ భామకి బాలీవుడ్ లో నటించే అవకాశం వచ్చిందట. జయేష్ భాయ్ జోర్దార్ అనే సినిమాలో షాలినీ పాండే హీరోయిన్ గా అవకాశం పొందిందట. ఈ విషయాన్నే ఆమె ప్రకటించింది.

 

ఈ అవకాశం రావడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయిందట. ఎన్నాళ్ల నుండో వెయిట్ చేస్తోన్న తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. మరి తెలుగులో అంతగా రాణించని షాలినీ పాండే బాలీవుడ్ లో అయినా నిలదొక్కుకుంటుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: