టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలకు బాక్సాఫీస్ హిట్స్ అందించిన ప్రముఖ దర్శకులు వివివినాయక్ హీరోగా ‘శీనయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హీరోల మాస్ ఇమేజ్ ను మరింత పెంచిన దర్శకులలో వినాయక్ ఒకరు. ఆయన దర్శకత్వంలో నటిస్తే హీరోలకు మంచి లైఫ్ ఉంటుందని అంటారు.  అందుకే గతంలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమాకు వివివినాయక్ నే తీసుకున్నారు.  ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు శీను’ సూపర్ హిట్ అయ్యింది.

 

అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవన్నట్టు అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ తో ‘అఖిల్ ’ మూవీ తెరకెక్కించాడు. ఈ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయినా.. అఖిల్ కి మాత్రం మంచి పేరు వచ్చింది. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో నరసింహారావు దర్శకత్వంలో వివివినాయక్ హీరోగా ‘శీనయ్య’ మూవీ తెరకెక్కిస్తున్నారు.  అయితే ఈ మూవీ సగం షూటింగ్ పూర్తయ్యాక ఔట్ పుట్ విషయంలో గందరగోళం ఏర్పడింది. ఒక దర్శకుడిగా మూవీ లోటు పాట్లు గమనించిన వివివినాయర్ ఔట్ పుట్ పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ సినిమా అటకెక్కిందన్న వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి.  కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోలేదట.

 

ఒక వైపున స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతూనే, మరో వైపున షూటింగును తిరిగి ఆరంభించాలనే నిర్ణయానికి 'దిల్' రాజు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ మూవీ సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ఓ సగటు మనిషి ఎలా పోరాడుతాడు అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.  స్క్రిప్ట్ విషయంలో మరికొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ మూవీ మళ్లీ సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సిద్దమవుతున్నారట. అన్నీ కుదిరితే.. ఈ నెల 19 లేదా 20వ తేదీల్లో ఈ సినిమా షూటింగు తిరిగి ప్రారంభం కానున్నట్టుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: