ఈ మద్య సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు ఏది నమ్మాలో ఏది నమ్మోద్దో అన్న విషయంలో నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు.  ముఖ్యంగా సెలబ్రెటీల గురించి వస్తున్న వార్తల విషయంలో అయితే ఇది కాస్తే ఎక్కువే అనిపిస్తుంది.  తాజాగా నేచురల్ స్టార్ నాని విషయంలో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  ప్రస్తుతం నాని హీరోగానే కాకుండా నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టాడు.  ఈ మద్య రిలీజ్ అయిన హిట్ చిత్రంతో మంచి విజయం అందుకున్నారు.  తాజాగా తన కొత్త ప్రాజెక్టు ‘శ్యామ్‌ సింగరాయ్‌’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించబోతున్నారు.  

 

అయితే ఈచిత్రం కథ  రూ.50 లక్షలు పెట్టి కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.  గతంలో విజయ్ దేవరకొండ లాంటి హీరోకి టాక్సీవాలా హర్రర్, థ్రిల్లర్ లాంటి హిట్ చిత్రం అందించాడు  రాహుల్‌ సంకృత్యాన్‌.  అలాంటి దర్శకుడిపై నమ్మకంతో నాని హైదరాబాద్‌లోని ఓ ఆడియో కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్‌ వద్ద  రూ. 50 లక్షలు పెట్టి ఓ కథ కొన్నారట.  ఈ కథ నానికి బాగా నచ్చడంతో ఏమీ ఆలోచించకుండా ఎవరికీ వెళ్లకుండా ఎక్కువ మొత్తం ఇచ్చి, తీసుకున్నట్లు తెలుస్తోంది.  కాకపోతే ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.. ఈ వార్తలో ఎంత నిజం ఉందో అన్న విషయం పై  నాని స్పందించాల్సిందే.  

 

ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు నటిస్తున్న ‘వి’ చిత్రంలో బిజీగా ఉన్నారు. 
ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావు హైదరీ హీరోయిన్లు గా నటిస్తున్నారు.  అంతే కాదు నిన్ను కోరి, మజిలీ ఫేం శివ నిర్మాణలో 'టక్ జగదీశ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా నిర్మాణ రంగంలోకి దిగిన నాని చాలా వరకు స్క్రిప్ట్ విషయంలో చాలా ఆలోచించి అడుగులు వేస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: