పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ మీకు గుర్తుందా? జగపతి బాబు హీరోగా నటించిన కబడ్డీ కబడ్డీ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె గుర్తుండే ఉంటుంది. 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' సినిమాలో రవితేజ సరసన నటించి నంది అవార్డును సంపాదించింది కూడా ఈ అందాల తారే. 15 సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా కొనసాగింది ఈమె. 

 

IHG

 

ఇంతకీ ఈ నటి పేరేంటంటే 'కల్యాణి'. హీరోయిన్ గా కొంతకాలం తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన కల్యాణి ఆపై కొన్ని సంవత్సరాలపాటు వదినగా, తల్లిగా కూడా నటించింది. తరువాత దర్శకుడైన సూర్య కిరణ్ ని పెళ్లాడి సినీ పరిశ్రమకి కాస్త దూరంగా ఉంది. కానీ భర్తతో కొన్ని మనస్పర్ధలు రావడం వలన అతనికి విడాకులు ఇచ్చేసి మళ్ళీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కానీ ఈ సారి మాత్రం నటిగా కాకుండా డైరెక్టర్ గా అవతారమెత్తెందుకు రెడీ అయ్యింది.

 

IHG

 

'కావేరి కల్యాణి' అనే స్క్రీన్ నేమ్ తో తన డైరెక్టోరియల్ కెరీర్ మొదలు పెడుతున్న కళ్యాణి... మొట్టమొదటిగా తాను తమిళ తెలుగు బాషలలో విడుదలవ్వనున్న ఓ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు తన కే2కే సొంత బ్యానర్ కింద ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఐతే ఈ సినిమాలోని ప్రధానపాత్రలో తమిళ స్టార్ చేతన్ శీను, సుహాసిని, మణిరత్నం తదితరులు నటిస్తున్నారు. ఏది ఏదైనా ఎన్నో సంవత్సరాల పాటు మన తెలుగు ప్రేక్షకులకు కనిపించకుండా కనుమరుగైన అందాల తార కల్యాణి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో సడన్ గా అడుగు పెట్టి డైరెక్టర్ గా మారటం అందర్నీ ఆశ్చర్యపరచడంతో పాటు షాక్ కి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: