శేఖర్ కమ్ముల.. ఈయన సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. హ్యాపీడేస్, గోదావరి, ఆనంద్ ఇలాంటి ఓ ఆహ్లాదకరమైన, మంచి అనుభూతినిచ్చే చిత్రాలను తెరకెక్కించడంతో శేఖర్ కమ్ముల దిట్టా. ప్రస్తుతం ఈయన అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా `లవ్ స్టోరీ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటిస్తోంది. మంచి కాఫీలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేసే శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకుడు కావడంతో ఈ లవ్ స్టోరి పై బాగానే అంచనాలు.
ఇక ఈ చిత్రం విభిన్నమైన ప్రేమకథాంశంతో నిర్మితమవుతోంది. లవ్ స్టోరీ సినిమాలో ఓ ఇన్నర్ స్టోరీ ఉందని అంటున్నారు. చైతు ఇప్పటి వరకు డ్యాన్స్ బేస్డ్ సినిమా చేయలేదు. ఈ సినిమాలో మెయిన్ స్టోరీ మొత్తం కూడా డ్యాన్స్ చుట్టూనే నడుస్తుందని అంటున్నారు. పల్లెటూరి నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో అనుకున్నది ఎలా సాధించారు అన్నది సినిమా. అయితే 2017లో ఫిదా సినిమాతో వచ్చిన శేఖర్ కమ్ముల మళ్ళీ సినిమాను విడుదల చేయలేదు.
ఇలా సినిమా సినిమాకూ రెండు, మూడేళ్లు గ్యాప్లు తీసుకోవడం శేఖర్ కమ్ములకు అలవాటు అయిపోయింది. ప్రస్తుతం ఫిదా చిత్రం తర్వాత లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నాడీయన. ఈ సినిమాను 2019 సెకండ్ హాఫ్ లో మొదలుపెట్టారు. అయితే శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించే ముందు నాలుగే నెలల్లో షూటింగ్ ను పూర్తి చేస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఎనిమిది నెలలు అయిపోయాయి. ఇంకా షూటింగ్ బ్యాలన్స్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఏప్రిల్లో విడుదల అవుతుందన్న ఆశలు కూడా లేవు.
వాస్తవానికి భారీ బడ్జెట్ సినిమాలు లేట్ అయినా.. ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, లవ్ స్టోరీలకు కూడా ఇన్నేసి వర్కింగ్ డేస్ అంటే కాస్త కష్టంమనే చెప్పాలి. ఇక ఈ విషయం ఎక్కువ హైలైట్ కాకుండా ఉండడానికి తెలివిగా లవ్ స్టోరీ చిత్రటీమ్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా సమ్మర్లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.