తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల ఒక వెలుగు వెలిగాడు. శ్రీను వైట్ల అంటే ఒక బ్రాండ్ ఉండేది. అసలు కామెడీకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలు తీసింది ఈయనే.. అప్పట్లో దర్శకుడు శ్రీను వైట్ల సినిమా అంటే కచ్చితంగా బాక్సాఫీస్ బద్ధలైపోయేది. ఆయన వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఆ తర్వాత కనిపించకుండా పోయాడు ఈ దర్శకుడు. అసలు శ్రీను వైట్ల దర్శకుడు ఒకరున్నరనేది ప్రేక్షకులకు గుర్తెలేదు. 2014లో వచ్చిన ఆగడు సినిమాతో కనిపించకుండా పోయాడు. అసలు ఈ సినిమాతో ఈయన టర్న్ అయిపోయింది. కానీ.. ఈ సినిమా భారీ అంచనాలతో.. బాక్సాఫీస్ బద్దలు కొడతది అనుకుంటే అత్యంత దారుణంగా నిరాశపరిచింది ప్రేక్షకులను, అభిమానులను.. ఇటు దర్శకుడిని. 

 


 ఆ తర్వాత శ్రీను వైట్ల రామ్ చరణ్ తో బ్రూస్ లీ సినిమా చేశాడు కానీ ఇది ఆశించిన ఫలితాలను రాబట్టలేక పోయింది. ఆ తర్వాత వరుణ్  తేజ్ మిస్టర్ సినిమా చేశాడు ఇది కూడా నిరాశే మిగిల్చింది. దీని తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను చేశాడు. కానీ ఇది కూడా అలానే అయింది. 

 


దీంతో శ్రీను వైట్లకు వరుస డిజాస్టర్ లు అయ్యాయి. ఇక ఈయన క్రేజ్ తగ్గిపోయింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీను వైట్లతో సినిమా అంటేనే భయపడుతున్నారు నిర్మాతలు. ఒకవైపు హీరోలు కూడా శ్రీను వైట్ల కనిపిస్తే ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో చాలా రోజుల తర్వాత శ్రీను వైట్ల మరో కథ సిద్ధం చేసుకున్నాడని తెలుస్తుంది.

 

 

ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా అంటే పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌ టైనర్‌‌ ఉండేది. అయితే ఇప్పుడు సిద్దం చేసిన కథ కూడా ఇలానే ఉందట. అయితే.. ఈ కథను హీరో మంచు విష్ణుకు వినిపించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌ లో వచ్చిన ఢీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఆ నమ్మకంతోనే విష్ణు కి కథ చెప్పే ప్రయత్నంలో ఉన్నాడట.. పైగా ఇది కూడా ఢీ సీక్వెల్ అనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా., ప్రస్తుతం విష్ణు మోసగాళ్లు, భక్త కన్నప్ప సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈ సమయంలో విష్ణు శ్రీను వైట్లకు కి ఛాన్స్ ఇచ్చి ఆదుకుంటాడా లేదా..? అని చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: