జబర్దస్త్ షో నుండి వెళ్లిపోయిన తర్వాత మల్లెమాల ఎంటర్టైన్మెంట్ సంస్థపై నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ లో సంచలన కరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జబర్దస్త్ షోలో నటించే కమెడియన్ల విషయాలలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వాళ్లు చాలా కర్కశంగా వ్యవహరించారని, షో నుండి వెళ్ళిపోయినా తరువాత నాగబాబు ఆరోపణలు చేశారు. కేవలం జబర్దస్త్ షో అంత రేటింగ్ రావడానికి కారణం తానే అంటూ షో సక్సెస్ అయినా గాని, జబర్దస్త్ షో లో నటించిన ఆర్టిస్టుల విషయంలో వారి కష్టాల్లో ఏనాడు కూడా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ యాజమాన్యం పాలు పంచుకోలేదని ఆరోపణలు చేశారు. ఆ షో నుండి వెళ్ళిపోయినా తర్వాత జి తెలుగులో 'అదిరింది' అనే షో స్టార్ట్ చేశారు నాగబాబు.

 

భారీ అంచనాలు మధ్య స్టార్ట్ అయిన ఈ షో పెద్దగా ఏమీ రాణించలేక పోతోంది. అన్ని షోలు మాదిరిగానే రన్ అవుతుంది. దీంతో నాగబాబు యాంకరింగ్ విషయంలో శ్రద్ధ తీసుకుని గ్లామర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా మరియు మంచి మాటకారి అయినా రష్మీ అనసూయలకు పోటీ గా ఉంటుందని సమీరా షేక్ అనే అమ్మాయిని రంగంలోకి దింపడం జరిగింది. అయినా గాని ప్రయోజనం ఏమీ లేదు. దీంతో ఒక్కసారిగా హఠాత్తుగా యాంకర్ సమీరా షేక్ అనే అమ్మాయి షోలో కనిపించకుండా పోయింది.

 

దీంతో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. షో లో ఆమెను అవమానించి యాజమాన్యం పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అదిరింది షోలో తనకు అవమానం జరిగిందని సమీరా షేక్ వీడియో పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు నాగబాబు పై విమర్శలు వస్తున్నాయి. జబర్దస్త్ పై ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు చేసిన వాడు ఇప్పుడు ఏం మాట్లాడవేంటి అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు అయితే ఈ సమీరా - నాగబాబు ల గోలెంటి రా నాయనా అంటూ ఎటకారం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: