టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరు శివశంకర్ మాస్టార్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.. హిట్స్ సాధించారు.  తమిళనాట ఆయన కెరీర్ బాగా సాగింది.  తెలుగు లో ఓంకార్ హూస్ట్ గా చేసిన పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు శివ శంకర్ మాస్టార్ జడ్జీగా వ్యవహరించారు.  అప్పట్లో ఆయన పేరు ఎంతో పాపులర్ అయ్యింది.  మగధీర సినిమాాలో ధీర ధీర పాటకు మంచి పేరు వచ్చింది.  ఆయన ఎన్నో సూపర్ హిట్ పాటలకు ఆయన నృత్య రీతులను సమకూర్చారు. అలాంటి శివశంకర్ మాస్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఒక హీరో విషయంలో ఎంతో బాధపడ్డానని.. ఆ హీరోకి వరుస పరాజయాలతో సతమతం అవుతున్న సమయంలో ఆయన పై గౌరవం తో ఓ మూవీలో సాంగ్ కంపోజ్ చేశానని.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

 

కానీ అతను మాత్రం నన్ను పూర్తిగా మర్చిపోయారని.. ఒకానొక సమయంలో ఇంటికి వెళ్తే ఇంట్లో ఉండి లేడనిపించుకున్నారని వాపోయారు.  ఇక కొంత మంది హీరోలు తమలాంటి వారిని కారవాన్ లో కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ వెయిట్ చేయించే వాళ్లు చాలామందే వున్నారు. ఈ సందర్భంగా ఎన్టీరామారావు గారి గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఎంతో గొప్ప వారి అని అన్నారు.  సాధారణంగా ఎన్టీ రామారావు గురించి వినడమే అప్పటికి నేను కొరియోగ్రాఫర్ గా కొనసాగుతన్నా.. ఒకసారి నేను ఆయనను కలవడానికి వెళితే, ఆయన చాలా బిజీగా వున్నారు. 

 

అయితే నేను నిరాశతో వెనుదిరిగిపోవాలని నిశ్చయించకున్నానని..  కానీ ఆ సమయంలో ఓ వ్యక్తి వచ్చిన నన్ను పక్క రూమ్ లో కూర్చోమని చెప్పారు. మాస్టర్ గారికి ఏం కావాలో చూడమని అక్కడివారికి  ఎన్టీ రామారావు చెప్పారట.  షూటింగ్ బిజీ పూర్తి కాగానే ఆయన స్వయంగా తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని అలాంటి గొప్ప మనసున్న వ్యక్తులు కనుకనే ప్రేక్షకులు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: