రాజకీయాల్లోనే కాదు..సినిమాల్లో కూడా శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరని రీసెంట్ ఇన్సిడెంట్స్ తో తెలుస్తోంది. బయటకు మేం మేం ఒకటే .. దోస్తులం దోస్తులమే అని ఎంత చెప్పుకున్నా.. లోపల జరిగే గొడవలు మాత్రం ఎలాగొలా బయటికొస్తూనే ఉంటాయి. టాలీవుడ్ లో కూడా అంతే .. అబ్బే మామధ్య అలాంటివేం లేవు అని ఎంత మేకప్ వేసినా .. ఏదోరకంగా ఇష్యూస్ ఎక్స్ పోజ్ అవుతూనే ఉంటున్నాయి.  ఈ మద్య స్టార్ హీరోలు, డైరెక్టర్ల మధ్య ఇలాంటి డిఫరెన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

 

 

ఒకప్పుడు మీతో సినిమా చేస్తానని డైరెక్టర్ అయినా హీరో అయినా కమిట్ అయితే .. ఆ మాటే బాండ్ పేపర్ . కానీ ఇప్పుడు అడ్వాన్సులు తీసకుని కూడా ..ఇదిగో అదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇలా రకరకాల ఇష్యూస్ తో హీరోలు, డైరెక్టర్ల ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. రీసెంట్ గా మహేష్ బాబు వంశీ పైడిపల్లి మధ్య కూడా ఇలాంటి సంఘటనేజరిగింది. మహేష్ కు  మహర్షి సినిమాతో కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి మైలేజ్ ఇచ్చాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. నిజానికి మహర్షి సినిమా వంశీ తో ఎప్పుడో చేస్తానని కమిట్ అయ్యాడు మహేష్. కానీ మధ్యలో వేరే సినిమాలు చేసి వంశీ ని వెయిట్ చేయించాడు. 

 

 

తీరా సినిమా చేశాక సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత వంశీ తో మరో సినిమా చేస్తానని మహేష్ కమిట్ అయ్యాడు. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు చేశాక అందరూ వంశీ మహేష్ కాంబినేషన్లోనే సినిమా ఉంటుందనుకున్నారు. కానీ సడెన్ గా వంశీ ని సైడ్ ట్రాక్ చేసేశాడు మహేష్ . మహేష్ తోసినిమా కోసంఇన్నాళ్లు వెయిట్ చేసిన వంశీ హర్ట్ అయ్యాడని , ఇద్దరి మధ్యా కోల్డ్ వార్ జరుగుతోందని టాలీవుడ్ టాక్.

 

 

విజయ్, క్రాంతి మాధవ్ మధ్య కూడా ఇలాంటి ఇష్యూనే నడుస్తోంది. క్రాంతి మాధవ్ డైరెక్షన్లో విజయ్ రీసెంట్ గా చేసిన  వరల్డ్ ఫేమర్ లవర్ సినిమా కు సంబందించి ఎటువంటి ప్రమోషన్స్ లో అసలు డైరెక్టర్ ని కంప్లీట్ గా సైడ్ చేసేశాడు విజయ్. దర్శకుడికి ఏమాత్రం క్రెడిట్ ఇవ్వకుండా మొత్తం సోలో గా డ్రైవ్ చేసినట్టు బిల్టప్ ఇచ్చాడని ఓపెన్ గానే నెగెటివ్ కామెంట్స్ ఫేస్ చేశాడు ఈ రౌడీ హీరో. 

 

అంతకుమందు డియర్ కామ్రేడ్ సినిమా అప్పుడు కూడా డైరెక్టర్ భరత్ కమ్మతో ఇలాంటి భేదాభిప్రాయాలు వచ్చాయి  విజయ్ కి. ఫస్ట్ రీజనల్ సినిమాగా స్టార్ట్ చేసి తర్వాత ప్యాన్ ఇండియా సినిమా అంటూ అనవసరంగా ఇంటర్ ఫియర్ అయ్యాడని , అందుకే సినిమా అంతగా ఆడలేదని భరత్ కమ్మ తన క్లోజ్ సర్కిల్స్ లో కామెంట్ చేశాడు. 

 

 

నాగశౌర్య, వెంకీ కుడుముల మధ్య ఉన్న మిస్ అండర్ స్టాండింగ్స్ ఈ మద్యనే బయటపడ్డాయి. వెంకీ కుడుముల.. భీష్మతో , నాగశౌర్య.. అశ్శద్దామ సినిమాతో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చారు. నాగశౌర్య.. అశ్వద్దామ సినిమాకు స్టోరీ అందించాడు.. ఛలో సినిమా స్టోరీ కూడా నాదే అన్నట్టు పబ్లిక్ గా చెప్పాడు . అయితే తర్వాత వెంకీ  ఈఇష్యూకి సంబందించి నాతో ఎవరు పనిచేసినా క్రెడిట్ ఇస్తాను.. అసలు దీనిపై కామెంట్ చెయ్యదలచుకోవట్లేదని చెప్పాడు . కానీ నిప్పు లేనిదే పొగరాదుగా ఇష్యూ లేకపోతే ఇలా మాట్లాడుకోరుగా అనుకుంటున్నారు జనాలు

మరింత సమాచారం తెలుసుకోండి: