అందం, అభినయం అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది లావణ్యా త్రిపాఠి. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భమ. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభినయానికి మంచి పాత్రలు, చిత్రాల్లో నటిస్తున్నారు. అసంబద్ధమైన చిత్రాల్లో నటించడం కంటే నిశ్శబ్దంగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడే లావణ్యా త్రిపాఠికి ఇప్పుడు తెలుగు, తమిళ భాషలలో ఆసక్తికరమైన పాత్రలు వస్తున్నాయి. ఆమెకు స్క్రిప్ట్ నచ్చితే... ఆ సినిమా కోసం ఎంతైనా కష్టపడతదట. వంద శాతం బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి చూస్తానంటుంది ఈభామ. ఒక్కసారి కమిట్ అయితే ఎంత కష్టమైనా పడతదట. ఇటీవల దక్షిణాది సినిమాలతో బిజీగా ఉన్న ఈ భమ డేట్స్ అడ్జస్ట్ చేయలేక, కొన్ని బాలీవుడ్ సినిమాలను సైతం వదులుకున్నారట.
తెలుగులో 'అర్జున్ సురవరం' విజయం తర్వాత 'ఏ1 ఎక్స్ప్రెస్'లో లావణ్యా త్రిపాఠి నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో సందీప్ కిషన్ సరసన ఆమె కనిపించనుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో ఆమెది హాకీ క్రీడాకారిణి పాత్ర. సినిమా కోసం కొన్ని రోజులు హాకీలో శిక్షణ కూడా తీసుకుంది. ఈ సినిమాతో పాటు తెలుగులో కార్తికేయ సరసన 'చావు కబురు చల్లగా' సినిమాలో ప్రస్తుతం ఈమె నటిస్తుంది. 'భలే భలే మగాడివోయ్', 'శ్రీరస్తు శుభమస్తు' విజయాల తర్వాత ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ లో ఆమెకు హ్యాట్రిక్ సినిమా అది.
తమిళంలో అథర్వ కథానాయకుడిగా కొరటాల శివ శిష్యుడు రవీంద్ర మాధవ దర్శకత్వంలో మైఖేల్ రాయప్పన్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. అందులో లావణ్యా త్రిపాఠి కథానాయిక. అందంతో పాటు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలిసింది. లావణ్యా త్రిపాఠి అయితేనే పాత్రకు న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలు భావించారు, దాంతో ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. లావణ్యా త్రిపాఠి ప్రజన్స్ సినిమాకు వేల్యూ యాడ్ చేస్తుందని దర్శకుడు భావిస్తున్నారు.