ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సిద్దార్థ నటించిన ‘బాయ్స్’ మూవీలో అతని ఫ్రెండ్ గా నటించాడు తమన్.  నటుడిగా ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు.. కానీ తర్వాత కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ గా పలు చిత్రాలకు సంగీతం అందించారు.  అప్పట్లో ఒకప్పుడు కాపీ సాంగ్స్.. కాపీ సాంగ్స్ అంటూ ఎగతాళి చేసిన ఎందరో ఇప్పుడు తమన్ మారిపోయి తన సంగీతంతో మాయచేస్తున్నాడంటున్నారు. సాధారణంగా మ్యూజిక్ అంటేనే చిత్రానికి ప్రాణం అని అంటారు.. అలాంటిది తన సంగీతంలో కాపీ అని ఎగతాళి చేసినప్పుడల్లా కాదో మోర్రో అంటూ సర్ది చెప్పేవారు. 

 

తమన్ తన సినీ కెరీర్ లో కొన్ని వందల చిత్రాలకు సంగీతం అందించారు.  కానీ అప్పట్లో పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేక పోయాడు.  వరుస ప్లాపుల తర్వాత తమన్ తనతో తానే చర్చించుకున్నాడు. ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదగాలంటే.. అంత సామాన్య విషయం కాదని గ్రహించిన తమన్ తన సంగీతంలో తప్పస్సు చేశాడు.  తమన్ మారిపోయాడనే మాట ఇప్పుడు తరచూ వినపడుతోంది. నిజంగానే ఇప్పుడు తమన్ టాలీవుడ్ ని మాయం చేస్తున్నారని అంటున్నారు.

 

  'తొలిప్రేమ', 'భాగమతి', 'అరవింద సమెత', 'అల వైకుంఠపురములో', ఇప్పుడు 'వకీల్ సాబ్' లాంటి చిత్రాలు చేసి ఒక్కో చిత్రాలతో  తన స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాడు.  ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు తమన్.   ఇటీవల త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంలో సామ జవరగమనా, రాములో రాముల యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ సాంగ్స్ తో మిలియన్ల మంది మనసులు దోచాడు తమన్. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఓ పేరు రావాలంటే ఎంతో కష్టపడాలని.. దానికి అదృష్టం కూడా కలిసి రావాలని గట్టిగా నమ్ముతున్నాడు తమన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: