నవీన్ చంద్ర హీరోగా నటించిన అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది లావణ్యా త్రిపాఠి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటి వరకు ఉన్న గ్లామర్ హీరోయిన్స్ కి ధీటుగా లావణ్య ప్రేక్షకుల మన్నలను పొందింది. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాగా పేరు తీసుకు వచ్చాయి. చిన్న పాత్ర అయినా మనం సినిమాలో మెరిసి అందరి మెప్పు పొందించి. ఇక  ప్రస్తుతం లావణ్యా త్రిపాఠికి తెలుగు, తమిళంలో మంచి పాత్రలు వస్తున్నాయి. దాదాపు రెండేళ్ళు సినిమాలు లేక ఖాళీగా లావణ్య ఇప్పుడు ఫుల్ ఫాం లోకి వచ్చింది. 

 

తెలుగులో 'అర్జున్ సురవరం' హిట్ తర్వాత 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌' అనే సినిమాలో లావణ్యా త్రిపాఠి నటిస్తుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య హాకీ క్రీడాకారిణి గా నటిస్తుంది. ఈ సినిమా కోసం కొన్ని రోజులు హాకీలో శిక్షణ కూడా తీసుకొని నటిస్తొమది. ఈ సినిమాతో పాటు తెలుగులో ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ సరసన 'చావు కబురు చల్లగా' సినిమాలో నటిస్తున్నారు. 'భలే భలే మగాడివోయ్', 'శ్రీరస్తు శుభమస్తు' వంటి కమర్షియల్ హిట్ సినిమాల తర్వాత ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ లో లావణ్య నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం.

 

ఇక తమిళంలో అథర్వ హీరోగా కొరటాల శివ శిష్యుడు రవీంద్ర మాధవ దర్శకత్వంలో మైఖేల్‌ రాయప్పన్‌ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ తన ఖాతాలో పడటం ఖాయమన్న ధీమాతో ఉందట. అంతేకాదు లావణ్యా త్రిపాఠి అయితేనే ఈ పాత్రకు న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలు భావించి లావణ్యా త్రిపాఠి ని ఎంచుకున్నారట.మొత్తానికి టాలీవుడ్ లో లైఫ్ క్లోజ్ అనుకున్న లావణ్యా త్రిపాఠి మెల్లగా బండిని లాగించడం మొదలు పెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: