మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే టాలీవుడ్ లో మంచి పేరున్న నటుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల చిత్రలహరి, ప్రతిరోజు పండగే సినిమాలతో రెండు వరుస విజయాలు అందుకున్న సాయి తేజ్, ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇకపోతే ఆయన సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్, ఉప్పెన సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 

 

ఇక ఈ సినిమా నుండి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన నీకన్ను నీలి సముద్రం సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. మంచి క్లాసీ బీట్ తో సాగిన ఈ సాంగ్ కు దేవిశ్రీ మంచి మ్యూజిక్ అందించారు. నేడు ఈ సినిమా నుండి 'ధక్ ధక్ ధక్' అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. యువ గాయకులు శరత్ సంతోష్, హరిప్రియ కలిసి ఆలపించిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ ప్రస్తుతం మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళుతోంది. వరుసగా రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కూడా ప్రేక్షకుల మనసును తాకడంతో సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

 

హృదయానికి హత్తుకునే ఒక అందమైన స్టోరీ తో పలు ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ అంశాలు కలగలిపి దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ కెమెరా మ్యాన్ గా పని చేస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 2 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: