ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, దాని తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా మంచి హిట్ కొట్టడం జరిగింది. రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని మంచి యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ తెరకెక్కించారు. అయితే అతి త్వరలో వీరిద్దరూ కలిసి చేయనున్న నూతన సినిమా, దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని, అయినను పోయి రావాలె హస్తినకు అనేది ఆ సినిమా టైటిల్ అని సమాచారం. 

 

అలానే సినిమా యొక్క మూల కథ రాజకీయాల చుట్టూ తిరుగుతూ త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు అదరగొట్టే పంచ్ డైలాగ్స్ తో అదిరిపోయేలా ముందుకు సాగుతుందని అంటున్నారు. అలానే ఈ సినిమాకు మరొక్కసారి థమన్ మ్యూజిక్ అందించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి కీలక మైన విలన్ పాత్ర కోసం ఒక బాలీవుడ్ నటుడిని ఎంపిక చేసారట దర్శకుడు త్రివిక్రమ్. 

 

ఇటీవల సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా తెరకెక్కిన దర్బార్ సినిమాలో విలన్ గా నటించి మంచి పేరు దక్కించుకున్న బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ఈ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో తీసుకోవాలని చూస్తున్నారట త్రివిక్రమ్. నిజానికి ఆయన సినిమాల్లో హీరోతో పాటు విలన్ కు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే విషయం తెలిసిందే. సునీల్ శెట్టి అయితే తాను అనుకుంటున్న రోల్ కి పక్కాగా సరిపోతారని భావించిన త్రివిక్రమ్, అతి త్వరలో ముంబై వెళ్లి, ఆయనకు కథను వినిపంచనున్నట్లు చెప్తున్నారు. మరి ఇదేకనుక నిజం అయితే, తొలిసారిగా సునీల్ శెట్టి మన టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చే సినిమా ఇదే అవుతుందని చెప్పవచ్చు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: