సైరా తరువాత మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో ని రామోజీ ఫిలిం సిటీ లో రెండవ షెడ్యూల్ షూటింగ్ ను  జరుపుకుంటుంది. ఇక ఇటీవల ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుకోకుండా చిరంజీవిసినిమా టైటిల్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే. దాంతో ఉగాది కానుకగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విడుదలచేయాలని మేకర్స్ భావిస్తున్నారట త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రానుంది.
 
ఓ మంచి మెసేజ్ తో కమర్షియల్ అంశాలను జోడించి ఇప్పటివరకు వరసగా బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టిన కొరటాల ఈ ఆచార్య ను కూడా అదే ఫార్ములా తో తెరకెక్కిస్తున్నాడట. ఈ చిత్రం లో చిరు సరసన త్రిష కథానాయికగా నటించనుంది. వచ్చే వారం లో త్రిష ఈ షూటింగ్ లో జాయిన్ కానుందని సమాచారం. కాగా  చిరు తోకలిసి నటించడం త్రిష కు ఇది రెండో సారి ఇంతకుముందు స్టాలిన్ లో వీరిద్దరు జోడి కట్టారు. ఇక ఆచార్య లో రెజీనా కాసాండ్రా ఓస్పెషల్ సాంగ్ లో కనిపించనుండగా బాలీవుడ్ నటుడు సోను సూద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
 
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 14న విడుదలకానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తరువాత చిరంజీవి, హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటించే అవకాశాలు వున్నాయని సమాచారం. ఇటీవల చిరు కు లైన్ వినిపించిన హరీష్ ,ప్రస్తుతం పూర్తి  కథను సిద్ధం చేసే పనిలో వున్నాడట.  అన్ని కుదిరితే ఈ కాంబినేషన్ లో సినిమా గ్యారెంటీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: