ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సరైన హిట్ ఇప్పటిదాకా కొట్టలేకపోయారు. సినిమా ఇండస్ట్రీలో భారీ భారీ స్థాయి సినిమాలు తీసిన సరైన విజయం వరించలేదు. ఆఖరికి బెల్లంకొండ సురేష్ బోయపాటి ని డైరెక్టర్ గా... పెట్టి తన కొడుకుని హీరోగా 'జయ జానకి నాయక' అనే సినిమా తీసిన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రయోజనం లేకుండా పోయింది. భారీ అంచనాల మధ్య భారీ ప్రమోషన్ జరిగిన ఈ సినిమాకి మొదటి రోజే మిక్సిడ్ టాక్ రావడం జరిగింది. ఇటువంటి తరుణంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో  కందిరీగ 2 (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పేరొందిన సంతోష్ శ్రీనివాస్ బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమా పక్క మాస్ స్టోరీ కలిగిన సినిమా అని ఇండస్ట్రీలో టాక్.

 

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ అయిపోయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వచ్చాయి. కానీ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఇంకా బిజినెస్ ఓపెన్ గానే ఉంది అని అంటున్నారు చాలామంది. మాస్ డైరెక్టర్ మరియు మాస్ హీరో కాంబినేషన్ లో చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు 13 కోట్లు ఆఫర్ చేశారు నల్లమలపు శ్రీనివాస్ బుజ్జి. కాగా ఈ చిత్ర నిర్మాత ఈస్ట్ గోదావరి బయ్యార్ సుబ్రమణ్యం 15 కోట్లు దాటి వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నారు.

 

శాటిలైట్, డిజిటల్ బిజినెస్ కి సంబంధించి ఆరు కోట్ల వరకు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే హిందీ డబ్బింగ్ మరియు మిగతా కార్యక్రమాలు బేరాలు లో ఉన్నట్లు సమాచారం. సినిమా మొత్తానికి 30 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది నిర్మాత. ఈ నేపథ్యంలో కొంత వెయిట్ చేస్తే సినిమాకి పెట్టిన డబ్బు వచ్చే అవకాశం ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే ఈ సినిమాతో అయినా బెల్లంకొండ శ్రీనివాస్ విజయం సాధించకపోతే అతన్ని కాపాడే నాథుడే లేరని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: