రెజీనా కసాండ్రా సుధీర్ బాబు హీరోగా పరిచయమైన శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా సెటిలవుతుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగా మాత్రం రెజీనా టాలీవుడ్ లో ఫేమస్ కాలేకపోయింది. కానీ కొన్ని హిట్ సినిమాలు మాత్రం తన ఖాతాలో పడ్డాయి. పిల్లా నువ్వు లేని జీవితం, రొటీన్ లవ్ స్టోరీ, సుబ్రమణ్యం ఫర్ సేల్, పవర్ ఇలా .. వరుసగా మంచి హిట్స్ ని దక్కించుకుంది. అయితే ఆ తర్వాతే రెజీనా బాగా డీలా పడింది. అవకాశాలు దక్కించుకునే క్రమంలో వెనకబడిపోయింది. అటు కోలీవుడ్ లో కూడా కొన్ని హిట్స్ ఉన్నప్పటికి అక్కడా కెరీర్ సాఫీగా సాగలేదు. 

 

అయితే రీసెంట్ గా ఎవరు సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో రెజీనాకి మంచి పాత్ర పోషించే అవకాశం దక్కింది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఎవరు సినిమాలో రెజీనా తన సత్తా చూపించి ఎలాంటి పాత్రనైనా పోషించగలనని నిరూపించుకుంది. ఎవరు హిట్ తో మళ్ళీ మేకర్స్ తనవైపు చూసేలా చేసింది. ప్రస్తుతం రెజీనా 'నేనే నా' అనే ప్రయోగాత్మక సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తోంది.

 

ఇక చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య అనే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసే అవకాశం రెజీనాకి దక్కడం మిగతా హీరోయిన్స్ కి గట్టి షాకిచ్చింది. ప్రస్తుతం అంతమంది టాప్ హీరోయిన్స్ ఉన్నా కూడా ఈ స్పెషల్ సాంగ్ లో రెజీనా చిరంజీవితో కలిసి డాన్సులు చేసే ఛాన్స్ దక్కించుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

 

ఇక ఈ ఛాన్స్ రావడంతో రెజీనాకి ఆనందం మామూలుగా లేదు. చిరంజీవితో స్టెప్పులు వేయడం తను లైఫ్ లో మర్చిపోలేనని... ఈ స్పెషల్ సాంగ్ లో తనకి అవకాశం రావడం అదృష్టం అని తెగ సంబరపడుతోంది. అంతేకాదు మళ్ళీ ఇలాంటి స్పెషల్ సాంగ్ లో నటించనని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. దాంతో అందరూ చిరంజీవి తో కలిసి సాంగ్ లో చేస్తే లైఫ్ లో సరిపోతుందా..నీలా మిగతా హీరోయిన్ కూడా ఆలోచిస్తే ఇక మేకర్స్ స్పెషల్ సాంగ్స్ కోసం హీరోయిన్స్ వెంటపడి అడుక్కోవాల్సిందే .. ఈ ఒక్కసారికి ప్లీజ్ అని హీరోయిన్స్ వి కాళ్ళు, గడ్డాలు పట్టుకొని బ్రతిమాలు కోవాల్సిందే నని అంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: