టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ ని ప్రేక్షకులు చాలా పద్దతిగా చూడాలనుకుంటారు. తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తేనే బాగా ఇష్టపడతారు. పక్కింటి అమ్మాయిలా కాదు మన ఇంట్లో అమ్మాయిలా కనిపించే పాత్రలు చేస్తుంటే చాలా అభిమానిస్తారు. అలా ఇండస్ట్రీలో సౌందర్య, తర్వాత కీర్తి సురేష్ మాత్రమే బాగా ఆకట్టుకున్నారు. అయితే బాగా పాపులర్ కాకపోయినా 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో తెలుగమ్మాయి రీతూవర్మ టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. తర్వాత నాని నటించిన 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలోను నటించింది. అయితే ఈ రెండు సినిమాలలో రీతు వర్మ ఉందని చాలా మందికి తెలీదు. కాని విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన పెళ్లి చూపులు సినిమాలో సోలో హీరోయిన్ గా నటించి బాగా ఆకట్టుకుంది. కాని ఆ తర్వాత రీతూ వర్మ మళ్ళీ ఎక్కడా అంతగా కనిపించలేదు.

 

దీంతో కొన్నాళ్ళు తమిళ సినిమాలలో నటించింది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. వాస్తవంగా కోలీవుడ్ జనాలకి హీరోయిన్స్ అంటే బొద్దుగా ఉండాలి. నడుమొంపులతో కైపెక్కించాలి. హీరోలతో ఘాటు రొమాన్స్ చేస్తూ మూతి ముద్దులు పెట్టాలి. కానీ రీతూ ఇవన్ని చేయడంలో వెనకే ఉండిపోయింది. తెలుగు అమ్మాయి అయినా అటు తమిళం, ఇటు తెలుగులో గ్లామర్ హీరోయిన్స్ తాకిడికి తట్టుకోలేకపోతుంది. 

 

ఇక రీసెంట్ గా మలయాళ డబ్బింగ్ సినిమా 'కనులు కనులను దోచాయంటే' లో దుల్కార్ సల్మాన్ సరసన కనిపించింది. అయినా రీతూకి ఈ సినిమా ఒరిగించిందేమి లేదు. సినిమా రిలీజ్ అయిందన్న విషయం కూడా ఎవరికి తెలీదు. అయితే నాని చిత్రం 'టక్ జగదీష్' లో... శర్వానంద్ కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది కాని అందులో వాస్తవం ఎంత అనేది తెలీదు. అయితే కోలీవుడ్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో కొన్ని సినిమాలకి డేట్స్ ఇచ్చి కమిటవడం లో ప్లాన్స్ వర్కౌట్ అవకపోవడం ఒక సమస్య అయితే ముంబై హీరోయిన్స్ లాగా బికినీలు వేసుకొని బీచ్ సాంగ్స్ లో నటించడానికి ఒకే చెప్పక పోవడం, అందాలు ఆరబోయకపోవడం.. హీరోలకి ఘాటు పెదవి ముద్దులు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడం పెద్ద మైనస్ కావడంతో టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: