యువ సామ్రాట్ కింగ్ నాగార్జున సరసన సూపర్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు భామ అనుష్క శెట్టి ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటించి, ఆపై దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో అత్యద్భుత విజయాన్ని దక్కించుకుని టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా మంచి పేరు గడించింది. ఇక ఆ తరువాత నుండి వరుసగా తెలుగు తో పాటు తమిళ్ లో కూడా మంచి అవకాశాలు దక్కించుకున్న అనుష్క, ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి రెండు భాగాల్లో హీరోయిన్ గా నటించి మరింత గొప్ప పేరు సంపాదించింది. 

 

ఇక రెండేళ్ల క్రితం ఆమె నటించిన భాగమతి సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడం జరిగింది. అయితే ఆ తరువాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన అనుష్క, ఇటీవల మెగాస్టార్ సైరా నరసింహారెడ్డిలో మాత్రం చిన్న పాత్రలో మెరిసింది. ఇక ప్రస్తుతం నిశ్శబ్దం అనే సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్న అనుష్క, తప్పకుండా ఆ సినిమా కూడా సూపర్ హిట్ కొడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో షాలిని పాండే, అంజలి, సుబ్బ రాజు, హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్, మాధవన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫాక్టరీ సంస్థలు ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అతి త్వరలో ఎంతో భారీగా ప్లాన్ చేస్తోందట సినిమా యూనిట్. అయితే ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా రెబల్ స్టార్ ప్రభాస్ ని పిలవాలని కూడా అనుకుంటున్నారట యూనిట్ సభ్యులు. 

 

కాగా ఈ వేడుక కోసం ప్రభాస్ ని ఆహ్వానించడానికి దర్శక నిర్మాతలతో పాటు నిన్న ప్రభాస్ ఇంటికి వెళ్లిన అనుష్క, నువ్వు ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా రావాలి, నువ్వు వస్తాను అంటేనే నేను ఈ ఈవెంట్ ని సెలెబ్రేట్ చేసుకుంటాను, లేదంటే లేదు అని అనుష్క పట్టుబట్టడంతో, ప్రభాస్ కాదనలేకపోయారని సమాచారం. అయితే ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ అనేదానితో పాటు, ప్రభాస్ చీఫ్ గెస్ట్ అనే విషయమై కూడా సినిమా యూనిట్ అతి త్వరలో వెల్లడిస్తుందని సమాచారం. కాగా ఈనెల 12న అనుష్క సినిమా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నిశ్శబ్దం యూనిట్ ఒక ఈవెంట్ ని నిర్వహిస్తోంది. బహుశా ప్రభాస్ఈవెంట్ కి వచ్చినా రావచ్చని వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలపై అధికారిక ప్రకటన వచ్చేదాకా నమ్మలేం అని కొందరు అంటున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: