టాలీవుడ్ చిత్రాల్లో స్టార్ స్టేటస్ దక్కాలంటే కనీసం వరుసగా మూడు చిత్రాలైనా హిట్లు కొట్టాలి. అప్పుడు కానీ స్టార్ హీరోయిన్ అనేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితిలు మారాయి. ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోతున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉండడంతో హిట్ ఇచ్చిన బ్యూటీతోనే పని చేయాలని దర్శకనిర్మాతలు కూడా కోరుకుంటున్నారు. హీరోలది సైతం అదే తంతు ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్ర తక్కువే ఉన్నా.. మాస్ ఆడియన్స్ మాత్రం వారిని చూడడానికే థియేటర్ కు వస్తుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా ఆ మధ్య కాలంలో ఊపిరి, అభినేత్రి వంటి సినిమాల్లో కనిపించింది తమన్నా. ఊపిరి క్రెడిట్ మొత్తం నాగార్జున, కార్తీ ల ఖాతాలోకి చేరిపోవడంతో అమ్మడుకి పెద్దగా కలిసొచ్చింది లేదు. ఇక ఎన్నో ఆసలతో నటించిన అభినేత్రి సినిమా కూడా అంతంత మాత్రంగా మిగిలిపోయింది. రీసెంట్ గా ఒక్కడొచ్చాడు అనే డబ్బింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమాలో కేవలం పాటలవరకు మాత్రమే పరిమితమైంది.
ఇటీవలె సైరా నర్సింహారెడ్డి చిత్రంలో అదరగొట్టే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది ఈ భామ. ఆ చిత్రంలో, చిరంజీవి, నయన్లకంటే మంచి పేరు వచ్చింది ఈ మిల్కీ బ్యూటీకి. ఇక ఇటీవలె సూపర్డూపర్ హిట్ కొట్టిన `సరిలేరునీకెవ్వరు` చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో నటించి మెప్పించింది. `డ్యాంగ్ డ్యాంగ్` అంటూ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. మరి ఈ పాటకి ఫిదా అవ్వని వాళ్ళు ఎవ్వరూ లేరు ఆఖరికి సూపర్స్టార్ మహేష్ కూతురు కూడా ఈ పాటకు ఫిదా అయి సూపర్ డ్యాన్స్ కూడా చేసేసింది. ఇక ఐటెమ్సాంగ్స్కి కేరాఫ్ అడ్రస్గా మారింది మిల్కీబ్యూటీ.
ఇప్పటికే అల్లుడు శీను చిత్రంలో...బ్యాచ్లర్బాబు బ్యాచ్లర్బాబు అంటూ చిలకపచ్చ డ్రస్సులో వేసే స్పెప్పులకి ఫిదా అయిపోయారంతా. ఆ తర్వాత స్పీడున్నోడు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్లో నటించి మెప్పించిన తమన్నా మరోసారి జై లవ కుశ చిత్రంలో ఐటెమ్ సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది. స్వింగ్ జరా..స్వింగ్జరా అంటూ నడుఒంపులతో కట్టిపడేసిందంతే.