రెజీనా కసాండ్రా అందం అభినయం అన్నీ ఉన్నా కూడా లక్ మాత్రం కలిసిరావడం లేదు ఈ భామకి. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆశించినంత ఫలితం అయితే రాలేదు. సందీప్కిషన్తో, సాయిధరమ్తేజ్తో ఇలా ఎన్నో చిత్రాల్లో ఈ భామ నటించింది. ఇక ఇటీవలె విడుదలైన ఎవరు చిత్రం అడవిశేఖతో కలిసి నటించిన ఈ చిత్రం పర్వాలేదనిపించుకుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈచిత్రం పర్వాలేదనిపించుకుంది. అయితే అందులో రెజీనా పాత్రకి మాత్రం మంచి పేరు వచ్చింది.
కొన్ని బోల్డ్ సీన్స్లో చాలా సహజంగా నటించిందంటూ చాలా మంది ప్రశంసలు అందుకుంది ఈ భామ. ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఎవరులో ఆమె పాత్ర పూర్తి డిఫరెంట్గా ఉంటుంది. కంప్లీట్ నెగిటివ్ ఇంప్యాక్ట్ ఉన్న పాత్రలో రెజీనా నటించింది. ఇక ఇదిలా ఉంటే...ఈ చిత్రం తర్వాత ఈ భామకి పెద్దగా అవకాశాలు రాలేదు. తిరిగి ఇన్ని రోజులకి చిరంజీవి కొరటాల దర్శకత్వంలో వస్తు్న `ఆచార్య` చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ కి రెజీనాని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలె ఈ పాట చిత్రీకరణ పూర్తయింది.
ఇందులో చాలా అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటూ చిరు మెచ్చుకున్నారు. ఇప్పటివరకు తను ఎంతో మంది హీరోయిన్లతో ఐటెమ్ సాంగ్స్ చేశానని కానీ రెజీనా డ్యాన్స్ మాత్రం చాలా అద్భుతంగా చేసిందంటూ కామెంట్స్ ఇచ్చారట. మరి చిరు కామెంట్స్తోనైనా రెజీనాకి అవకాశాలు వస్తాయేమో వేచి చూడాలి. ఇక గతంలో చిరు సిమ్రాన్తో కలిసి అన్నయ్యలో వేసిన స్టెప్పులు `ఆటకావాలా.. పాటకావాలా..అచ్చమైన తెలుగుసాంగ్ బీట్కావాలా.. అనే పాట మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత లక్ష్మీరాయ్తో కలిసి ఆయన 150వ చిత్రం ఖైదీ.నెం.150లో `రత్తాలు రత్తాలు ఓసోసిరత్తాలు` అంటూ వేసే స్టెప్పులు అదిరిపోయింది. అయితే వీటన్నిటికి మించిన సాంగ్ ఇప్పుడు ఆచార్యలో ఆయన రెజీనా కలిసి చేస్తున్నారు. ఇది చాలా బాగా వచ్చిందట. అయితే ఫేడ్ అవుట్ అయిన ఈ భామకు ఈ సాంగ్ ఎంత వరకు మేలు చేస్తుందో చూడాలి మరి.